AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs PBKS Preview: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ల మధ్య పోరాటం.. పైసా వసూల్ గేమ్‌ పక్కా?

Lucknow Super Giants vs Punjab Kings, 13th Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మరో అద్భుతమైన మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల రికార్డులు, ప్రాబబుల్ ప్లేయింగ్ 11తోపాటు హెడ్ టు హెడ్ రికార్డులను తెలుసుకుందాం..

LSG vs PBKS Preview: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ల మధ్య పోరాటం.. పైసా వసూల్ గేమ్‌ పక్కా?
Lucknow Super Giants Vs Punjab Kings, 13th Match
Venkata Chari
|

Updated on: Mar 31, 2025 | 6:47 PM

Share

Lucknow Super Giants vs Punjab Kings, 13th Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్‌ తలపడనుంది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ మంచి ప్రదర్శనతో సొంతగడ్డపై ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాలని చూస్తున్నాడు. గత సంవత్సరం వేలంలో అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాడిగా నిలిచిన పంత్.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో తన భారీ ధర రూ. 27 కోట్లకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు.

సూపర్ జెయింట్స్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీ అవమానకర ఓటమితో ప్రారంభమైంది. అతను తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కేవలం ఒక వికెట్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ టీం తరపున నికోలస్ పూరన్ (23 బంతుల్లో 70), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) అద్భుతమైన బ్యాటింగ్, శార్దూల్ ఠాకూర్ (34కి 4 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకుంది.

ఇది కూడా చదవండి: Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో ఇద్దరు అత్యంత ఖరీదైన ఆటగాళ్ల మధ్య పోటీ..

గత మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించినప్పటికీ, పంత్ వరుసగా రెండోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతను 0, 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ దూకుడుగా ఉండే భారత ఆటగాడు పరుగులు సాధించడం ద్వారా తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో చేరిన తన మాజీ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్‌తో పంత్ తొలిసారి తలపడనున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన, రెండవ అత్యంత ఖరీదైన ఆటగాళ్ల మధ్య జరిగే పోటీ అవుతుంది. మరో అత్యంత ఖరీదైన ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలంలో రూ.26.75 కోట్లకు అమ్ముడైన అయ్యర్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్లకు గట్టి సవాల్ విసిరాడు.

బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకున్న పంజాబ్ జట్టు..

ఐపీఎల్ విజేత కెప్టెన్ అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాడు. గత సీజన్ నుంచి శశాంక్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రియాంష్ ఆర్య తన ఐపీఎల్ అరంగేట్రంలో పంజాబ్ తరపున 23 బంతుల్లో 47 పరుగులు చేయడం ద్వారా తన కెరీర్‌కు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, మీడియం పేసర్ విజయ్‌కుమార్ వైశాఖ్ పంజాబ్ తరపున సమర్థవంతంగా బౌలింగ్ చేశారు.

ఎకానా పిచ్ ఎలా ఉందంటే?

ఎకానా స్టేడియంలోని పిచ్ బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్నర్లు, స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. రెండు జట్ల స్పిన్నర్లు మ్యాచ్ ఫలితంలో కీలక పాత్ర పోషించగలరు. సూపర్ జెయింట్స్ బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను కలిగి ఉంది. ప్రత్యర్థులపై లక్నో బ్యాటర్లు భారీ స్కోరు చేస్తే, ప్రభావవంతమైన లెగ్ స్పిన్‌తో విజయాన్ని అందించే బాధ్యత రవి బిష్ణోయ్‌పై ఉంటుంది. అయితే, బిష్ణోయ్ అత్యుత్తమ ఫామ్‌లో లేడు. గత సంవత్సరం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి అతనితో పాటు ఉన్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2025: కావ్య మారన్ బృందానికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. ఉప్పల్ నుంచి తరలనున్న ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు

ఆతిథ్య జట్టు పంజాబ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ఆడించే అవకాశం కూడా ఉంది. ఐడెన్ మార్క్రామ్ కూడా ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగలడు. అనుభవజ్ఞుడైన భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ స్పిన్ దాడికి నాయకత్వం వహిస్తుండగా, గ్లెన్ మాక్స్వెల్ కూడా తన సత్తా చాటే అవకాశం ఉంది. పంజాబ్‌కు ఫాస్ట్ బౌలింగ్ ఎంపికలు కూడా చాలానే ఉన్నాయి. టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ ఏడుగురు బౌలర్లను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

ఇరు జట్లు:

పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, పైలా అవినాష్, హర్నూర్ సింగ్, జోష్ ఇంగ్లిస్, ప్రభ్సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, నేహల్ వధేరా, అజ్మతుల్లా ఉమర్జాయ్, ఆరోన్ హార్డీ, మార్కో జాన్సెన్, గ్లెన్ మాక్స్వెల్, ముషీర్ ఖాన్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యాంష్ షెడ్జ్, అర్ష్దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్, ప్రవీణ్ దుబే, లాకీ ఫెర్గూసన్, హర్ప్రీత్ బ్రార్, కుల్దీప్ సేన్, విజయ్ కుమార్ వైశాఖ్, యష్ ఠాకూర్.

లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, ఆర్యన్ జుయల్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరి, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, అర్షిన్ కులకర్ణి, ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..