AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి.. రోడ్డుపై అర్థరాత్రి రచ్చ మాములుగా లేదుగా..!

Kurnool IPL Violence: అర్ధరాత్రి వేళ సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురయ్యారు. అద్దాలు పగులుతూ లోపలికి రాళ్లు పడుతుండటంతో ప్రాణభయంతో కేకలు వేశారు. పిల్లలు, మహిళల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కేవలం క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు ఇలా సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Video: కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి.. రోడ్డుపై అర్థరాత్రి రచ్చ మాములుగా లేదుగా..!
Kurnool Ipl Violence
Venkata Chari
|

Updated on: Jun 01, 2026 | 1:22 PM

Share

Kurnool IPL Violence: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయం సాధించిన ఆనందం, కర్నూలు నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభిమానుల సంబరాలు మితిమీరి హింసాత్మకంగా మారడంతో ఒక ప్రైవేట్ బస్సు ధ్వంసమైంది. అర్ధరాత్రి వేళ ప్రయాణికులు భయాందోళనలతో అల్లాడిపోగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబరాల వేళ మితిమీరిన ఉత్సాహం.. రణరంగంగా మారిన కర్నూలు!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై బెంగళూరు జట్టు ఘనవిజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ కప్‌ను ముద్దాడటంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకున్నారు. కర్నూలు నగరంలోనూ ఆదివారం అర్ధరాత్రి వందలాది మంది యువకులు, అభిమానులు చేతుల్లో జెండాలు, బ్యానర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

నగరంలోని ప్రముఖ కూడలి అయిన రాజు విహార్ సెంటర్ వద్దకు చేరుకున్న భారీ జనసందోహం ఒక్కసారిగా రహదారిని దిగ్బంధించింది. వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్సాహం కాస్తా ఉన్మాదంగా మారడంతో అక్కడ ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య తలెత్తింది.

బస్సుపై రాళ్లవర్షం.. ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు..

ట్రాఫిక్ నిలిచిపోయిన క్రమంలో, రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ప్రైవేట్ రవాణా బస్సుపై కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బస్సుపైకి రాళ్లు రువ్వుతూ బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పూర్తిగా ముక్కలైపోయాయి.

అర్ధరాత్రి వేళ సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురయ్యారు. అద్దాలు పగులుతూ లోపలికి రాళ్లు పడుతుండటంతో ప్రాణభయంతో కేకలు వేశారు. పిల్లలు, మహిళల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కేవలం క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు ఇలా సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి పోలీస్ బలగాలు.. గంటపాటు హైడ్రామా..

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు స్థానిక పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీలకు పనిచెప్పి ఆందోళనకారులను, మితిమీరిన ప్రవర్తనతో రెచ్చిపోతున్న గుంపును చెల్లాచెదురు చేశారు. దాదాపు గంటపాటు శ్రమించి, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బస్సుపై దాడి జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల వేట.. పోలీసుల హెచ్చరికలు..!

“క్రీడా విజయాన్ని శాంతియుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, పండుగ లాంటి వాతావరణాన్ని పాడు చేస్తూ, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే ఊపేక్షించేది లేదు” అని కర్నూలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల రికార్డింగులను పరిశీలిస్తున్నారు. బస్సుపై రాళ్లు రువ్వి, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మ్యాచ్ ఎలా సాగిందంటే..?

అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టును బెంగళూరు బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, కేవలం 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

క్రీడలు అనేవి సమాజాన్ని జోడించాలే తప్ప, ఇలాంటి హింసకు వేదిక కాకూడదు. అభిమానం హద్దులు దాటినప్పుడు అది ఉన్మాదంగా మారుతుందనడానికి కర్నూలు ఘటనే నిదర్శనం. మ్యాచ్ గెలిచిన ఆనందాన్ని ఇలా సామాన్యుల ప్రాణాల మీదకు తెచ్చేలా మార్చడం ఖండించదగ్గ విషయం. ఇకనైనా అభిమానులు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఇంట్లో ఉండే కారం పొడి నకిలీదా..? ఒరిజినలా..? ఇలా తెలుసుకోండి
మీ ఇంట్లో ఉండే కారం పొడి నకిలీదా..? ఒరిజినలా..? ఇలా తెలుసుకోండి
కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి..
కర్నూలులో రెచ్చిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్.. బస్సుపై రాళ్లదాడి..
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
జుట్టు విపరీతంగా రాలిపోతోందా? నిపుణులు సూచిస్తున్న ఈ సూపర్ ఫుడ్స్
జుట్టు విపరీతంగా రాలిపోతోందా? నిపుణులు సూచిస్తున్న ఈ సూపర్ ఫుడ్స్
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే