AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: వేలానికి ముందు శత్రువులు.. అనూహ్యంగా ఒకే జట్టులో చోటు.. ఆసక్తి రేపుతోన్న ‘ఆ నలుగురు’..

అయితే విచిత్రంగా ఐపీఎల్ వేలానికి ముందు శత్రువులుగా ఉన్న కొంతమంది ప్రస్తుతం వేలంలో ఒకే జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. వారెవరో ఇఫ్పుడు తెలుసుకుందాం. లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్ రౌండర్స్..

IPL 2022: వేలానికి ముందు శత్రువులు.. అనూహ్యంగా ఒకే జట్టులో చోటు.. ఆసక్తి రేపుతోన్న 'ఆ నలుగురు'..
Ipl 2022 Deepak Hooda Vs Krunal Pandya
Venkata Chari
|

Updated on: Feb 15, 2022 | 1:05 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలం ముగిసింది. దీంతో అన్ని జట్లు కూడా తమ ఆటగాళ్ల సైన్యాన్ని నిర్మించుకున్నాయి. అయితే విచిత్రంగా ఐపీఎల్ వేలానికి ముందు శత్రువులుగా ఉన్న కొంతమంది ప్రస్తుతం వేలంలో ఒకే జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. వారెవరో ఇఫ్పుడు తెలుసుకుందాం. లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్ రౌండర్స్ విభాగంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యాను దక్కించుకుంది. అయితే వీరిద్దరు జాతీయ లీగ్‌ పోటీల్లో ఒకరిపై ఒకరు తీవ్రంగా దూషించుకోవడంతో పాలు పరస్పర వ్యక్తిగత మాటల దాడితో సంచలనంగా మారారు. ఒక మరో జోడీ గురించి చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ వివాదాస్పద ద్వయం రవిచంద్రన్‌, జోస్ బట్లర్.

సయ్యద్ ముస్తాక్ అలీ 2021కి ముందు బరోడా తరఫున ఆడుతున్నప్పుడు క్రునాల్-హుడా మధ్య వివాదం మొదలైంది. ఐపీఎల్ 2019 సమయంలో , PBKS తరపున ఆడుతోన్న భారత స్పిన్నర్ అశ్విన్, RR కోసం ఆడుతున్న ఇంగ్లీషు ఆటగాడిని జోస్ బట్లర్ రనౌట్ చేసిన తర్వాత హాట్‌ టాపిక్‌గా మారారు.

లక్నో సూపర్‌జెయింట్‌లు హూడాను రూ. 5.25 కోట్లకు దక్కించుకుంది. ఇక కృనాల్‌ను ఆ జట్టు రూ. 8.25 కోట్లకు జట్టులో చేర్చడంపై సోషల్ మీడియా అవాక్కైంది. ఐపీఎల్ మెగా వేలం 1వ రోజు మార్క్యూ ప్లేయర్ జాబితా సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ రూ. 5 కోట్లకు భారత స్పిన్నర్‌ అశ్విన్‌ను కొనుగోలు చేసిన వెంటనే.. అశ్విన్- బట్లర్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవ్వడం ప్రారంభించారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా జట్టు హోటల్ నుంచి బయలుదేరే ముందు దీపక్ హుడా.. కృనాల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. BCA CEO శిశిర్ హట్టంగడి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వైఖరి, జట్టు పట్ల నిబద్ధతను ప్రశ్నించాడు. దీంతో హుడా చివరికి బరోడాను విడిచిపెట్టి, దేశీయ క్రికెట్‌లో తన వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నంలో రాజస్థాన్‌ను వదులుకున్నాడు.

ఎదురుదెబ్బలను అధిగమించి, హుడా రాజస్థాన్‌తో కొత్త గరిష్టాలను తాకాడు. 2021-22లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆస్వాదించాడు. టోర్నమెంట్‌లో 168 భారీ స్ట్రైక్ రేట్‌తో రెండవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనలు అతనికి త్వరితగతిన తొలి కాల్-అప్ పొందడానికి సహాయపడింది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ దీపక్ హుడా తన ప్రభావం చూపాడు.

హుడాను కొత్త ఐపిఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 5.75 కోట్లకు ఎంపిక చేసుకోగా, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్ వార్ నుంచి వైదొలగడంతో పాండ్యా రూ. 8.25 ధర పలికాడు. హూడా తన కెరీర్‌లో చీకటి రోజులను అధిగమించడానికి అద్భుతమైన మానసిక బలాన్ని కనబరిచారు. అయితే వీరిద్దరూ గొడవల తర్వాత ఒకే జట్టు కోసం ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్ 2019లో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్‌ను రనౌట్ చేసిన తర్వాత అశ్విన్ ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్నాడు. మన్కడ్ పద్ధతిలో నాన్ స్ట్రైకర్‌ను ఔట్ చేయడం మంచి పద్ధతి కాదంటూ తేల్చింది.

“మేము వేలానికి ముందు జోస్‌తో మాట్లాడాం. ఆటగాళ్లకు మా ప్రాధాన్యతలన్నింటి గురించి వివరించాం. సహజంగానే, అతను దాని గురించి కూడా ఆలోచించలేదు. అతను దానితో పూర్తిగా బాగానే ఉన్నాడు. బహుశా అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. (నవ్వుతూ) మైదానంలో, వారు కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నారు” అని రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జేక్ లష్ మెక్‌క్రం అన్నారు.

బట్లర్‌తో అశ్విన్ బంధాన్ని చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో RR వారి IPL ట్రోఫీ కరువును అధిగమించడంలో సహాయపడుతుంని అంటున్నారు.

అయితే, ఐపీఎల్‌లో భారీ ధరకు బరిలోకి దిగిన తర్వాత మైదానంలో వివాదాస్పద ప్రత్యర్థులు ఒక్కటవ్వడం ఇదే తొలిసారి కాదు. టీ20 టోర్నమెంట్ నాల్గవ సీజన్‌లో అంత మంచి స్నేహితులుగా లేని ఆండ్రూ సైమండ్స్. హర్భజన్ సింగ్ కలిసి మైదానంలో రచ్చ చేశారు.

Also Read: IND vs WI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టీ20 సీరిస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్..

IPL 2022:14 కోట్ల కంటే తక్కువైనా పర్వాలేదు.. కానీ అదే జట్టుకి ఆడాలని అనుకున్నా..?