AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?

IPL 2025 మెగా వేలంలో టీమ్ ఇండియా ఆటగాడు తన IPL కెరీర్‌ను ముగించకుండా తప్పించుకున్నాడు. ఈ ఆటగాడు చాలా తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. దీంతో మరో ఏడాది వరకు రిటైర్మెంట్ కాకుండా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2025: టీమిండియా లెజెండరీ ప్లేయర్ కెరీర్ కాపాడిన ఐపీఎల్.. ఎందుకో తెలుసా?
Ajinkay Rahane
Venkata Chari
|

Updated on: Nov 26, 2024 | 6:01 PM

Share

IPL 2025 మెగా వేలంలో టీమ్ ఇండియా ఆటగాడు తన IPL కెరీర్‌ను ముగించకుండా సేవ్ అయ్యాడు. ఈ ఆటగాడు చాలా తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. ఇది ఎవరూ ఊహించలేదు. IPL 2025 మెగా వేలానికి ముందు, ఈ ఆటగాడి IPL కెరీర్ ముగుస్తుందని, ఏ జట్టు కూడా అతనిని కొనదని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఐపీఎల్ కెరీర్ తృటిలో మిస్..

IPL 2025 మెగా వేలంలో ఈ ఆటగాడి పరువు కాపాడింది. ఇప్పుడు ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడబోతున్నాడు. చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానెను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపిఎల్ 2025 సీజన్ కోసం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అజింక్య రహానే ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. ఇంతకుముందు, అజింక్య రహానే IPL 2023, IPL 2024 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

తక్కువ ధరకే..

ఐపీఎల్ 2025 సీజన్ కోసం అజింక్యా రహానెను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకుముందు, ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అజింక్య రహానే 13 మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. IPL 2024లో అజింక్య రహానే పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం అతన్ని విడుదల చేసింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 1.5 కోట్ల ధరకు అజింక్యా రహానేని కొనుగోలు చేసి, మునిగిపోతున్న అతని ఐపీఎల్ కెరీర్‌ను కాపాడింది.

ఇవి కూడా చదవండి

16 నెలల క్రితం చివరి అంతర్జాతీయ మ్యాచ్..

ఐపీఎల్‌లో అజింక్య రహానే స్ట్రైక్ రేట్ 123.42గా ఉంది. దాని కారణంగా అతను సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్‌గా కనిపించడం లేదు. అజింక్య రహానే ఇప్పటి వరకు 185 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 30.14 సగటుతో 4642 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అజింక్య రహానె చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. 16 నెలల క్రితం అజింక్య రహానే భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..