AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పు.. ఆ మ్యాచ్ షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన

KKR vs LSG: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి ఉంది. కానీ, శ్రీ రామ నవమిని దృష్టిలో ఉంచుకుని, కోల్‌కతా పోలీసులు ఈ మ్యాచ్‌లో మార్పులను సిఫార్సు చేశారు. ఎట్టకేలకు బీసీసీఐ ఈ మార్పును ప్రకటించింది.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పు.. ఆ మ్యాచ్ షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
Ipl 2025
Venkata Chari
| Edited By: |

Updated on: Apr 02, 2025 | 6:55 PM

Share

IPL 2025, KKR vs LSG: ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. చాలా రోజుల చర్చల తర్వాత, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఎట్టకేలకు ప్రకటించింది. అన్ని ఊహాగానాలు, పుకార్లు ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌ తేదీలో మాత్రం మార్పు చేసింది. మార్చి 28 శుక్రవారం నాడు బీసీసీఐ ఒక పత్రికా ప్రకటనలో ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్‌ను ఏప్రిల్ 8న నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే, మ్యాచ్ తేదీని మార్చారు. కానీ, వేదికలో ఎటువంటి మార్పు లేదు.

ఈ కారణంగా మార్పులు..

ఐపీఎల్ 2025లో 19వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 6న కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. కానీ, ఏప్రిల్ 6న రామనవమి వేడుకలను దృష్టిలో ఉంచుకుని, ఈ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని కోల్‌కతా పోలీసులు బీసీసీఐని కోరారు. నగరంలో జరగనున్న ఈ ఉత్సవానికి భద్రతా ఏర్పాట్లను పేర్కొంటూ కోల్‌కతా పోలీసులు ఈ మార్పును కోరారు. అప్పటి నుంచి దీని గురించి బీసీసీఐ నిరంతరాయంగా చర్చ జరుగుతూనే ఉంది.

రోజు, సమయంలో మార్పులు..

బీసీసీఐ నిర్ణయానికి ముందు, ఈ మ్యాచ్ కోల్‌కతాలో కాకుండా గౌహతిలో జరుగుతుందని నిరంతరం ఊహాగానాలు, పుకార్లు ఉన్నాయి. కానీ బీసీసీఐ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, కోల్‌కతా ప్రభుత్వం అలాంటి పుకార్లను తోసిపుచ్చాయి. మ్యాచ్ కోల్‌కతాలో మాత్రమే జరుగుతుందని చెప్పాయి. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మ్యాచ్ వేదికలో ఎటువంటి మార్పు ఉండదని కానీ ఏప్రిల్ 6 ఆదివారం కాకుండా, ఈ మ్యాచ్ ఇప్పుడు మంగళవారం, ఏప్రిల్ 8న జరుగుతుందని తెలిపింది. అయితే, మంగళవారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ముందుగా ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఈ మార్పు కారణంగా, ఏప్రిల్ 6 ఆదివారం నాడు డబుల్ హెడర్‌కు బదులుగా ఒక మ్యాచ్ మాత్రమే జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, అహ్మదాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఏకైక మ్యాచ్ జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..