AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR vs DC, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. సెంచరీ కొట్టిన రిషబ్ పంత్‌.. రికార్డు బద్దలు

ఐపీఎల్ 17వ ఎడిషన్ 9వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌కు దిగిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున..

RRR vs DC, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. సెంచరీ కొట్టిన రిషబ్ పంత్‌.. రికార్డు బద్దలు
Rishabh Pant
Basha Shek
|

Updated on: Mar 28, 2024 | 8:22 PM

Share

ఐపీఎల్ 17వ ఎడిషన్ 9వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌కు దిగిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అదేంటంటే.. సుమారు ఏడాది తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలోకి దిగిన రిషబ్‌ పంత్‌కి ఇది 100వ మ్యాచ్‌. దీంతో ఈ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక క్యాప్‌లు ఆడిన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. రిషబ్ పంత్ తన IPL కెరీర్‌ను 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించాడు మరియు అప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌ కే ఆడుతున్నాడు. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్ రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్‌లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్‌తో పంత్ ఢిల్లీ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషబ్ పంత్ ఇప్పటి వరకు 99 మ్యాచ్‌ల్లో 34.41 సగటుతో 2856 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధసెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. పంత్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీని చేపట్టి జట్టును ఒకసారి ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

రిషబ్ పంత్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లను పరిశీలిస్తే.. ప్రస్తుతం 99 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 2వ స్థానంలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ 87 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 82 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక లీగ్ విషయానికి వస్తే… రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తొలి విజయంపై కన్నేసింది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ తమ విజయాల పరంపరను కొనసాగించాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ రిషబ్ పంత్ కు 100వ మ్యాచ్ కావడంతో ఢిల్లీ గెలిచి కెప్టెన్ కు విజయాన్ని బహుమతిగా ఇస్తుందో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ తరఫున మొదటి ఆటగాడిగా…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..