IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. ముఖ్యంగా బుధవారం (మార్చి 27) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే
Mumbai Indians
Follow us

|

Updated on: Mar 28, 2024 | 8:13 PM

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. ముఖ్యంగా బుధవారం (మార్చి 27) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీనికి తోడు ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను టోర్నీ ఆరంభంలోనే కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పాండ్యా సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు పరాజయాలు చవిచూడడం కూడా ముంబై ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. వీటన్నింటి మధ్య ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక శుభ వార్త. అదేంటంటే హార్దిక్ పాండ్యా టీమ్‌ తమ తదుపరి 4 మ్యాచ్‌లను వారి సొంత మైదానమైన వాంఖడేలో ఆడనుంది. ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో జరిగిన 8 మ్యాచ్‌లను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఏ ఆతిథ్య జట్టు ఓడిపోలేదు.

మార్చి 22 నుంచి ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో తమ సొంత మైదానాల్లో ఆడిన అన్ని జట్లు విజయం సాధించాయి. దీనికి విరుద్ధంగా విజిటింగ్ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. RCB కథ కూడా ఇదే. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ.. సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీని ప్రకారం, ముంబై తన మొదటి రెండు మ్యాచ్‌లను ఇతర నగరాల్లో ఆడింది. తొలి మ్యాచ్‌లో ముంబై గుజరాత్ జట్టుతో అహ్మదాబాద్‌లో తలపడగా, రెండో మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైకు ఓటమి ఎదురైంది.

ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ, ఏప్రిల్ 14న వాంఖడేలో పంజాబ్ కింగ్స్‌తోనూ తలపడనుంది. అంటే ఆ జట్టు తమ సొంత మైదానంలో వరుసగా 4 మ్యాచ్‌లు ఆడనుంది. కాబట్టి ముంబైకి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచే అవకాశం ఉంది. జట్టు తదుపరి మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉంది. దీంతో జట్టు తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది. మరి స్వదేశంలో జట్టు ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు