Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..

ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. లక్నో, గుజరాత్ జట్లు తొలిసారిగా టోర్నీ ఆడనున్నాయి. జట్ల పెంపుతో ఐపీఎల్ థ్రిల్ కూడా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..
Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: Mar 15, 2022 | 8:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) తదుపరి సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో క్రికెట్ అభిమానులు ఎన్నో భారీ మార్పులను చూడనున్నారు. రెండు కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్(GT), లక్నో సూపర్ జెయింట్స్(LSG) చేరికతో, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో జట్ల సంఖ్య 10కి చేరుకుంది. గత సీజన్ వరకు 8 జట్లే బరిలోకి దిగేవి. IPL 2022 వేలంలో జట్ల రూపురేఖలు మారాయి. ఈసారి కొత్త కెప్టెన్‌తో 5 జట్లు టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. వీటిని ఒకసారి పరిశీలిద్దాం.

1. గుజరాత్ టైటాన్స్: ఈసారి IPLలో, గుజరాత్ టైటాన్స్ (GT) కొత్త ఫ్రాంచైజీగా చేరిన సంగతి తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్సీని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. పాండ్యా సారథ్యంలో ఆ జట్టు టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మరి తొలి సీజన్‌లో గుజరాత్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

2. లక్నో సూపర్ జెయింట్స్: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కూడా తొలిసారిగా IPL ఆడనుంది. ఈ జట్టు కెప్టెన్సీని ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. రాహుల్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. అతను పరుగుల పరంగా కూడా చాలా రికార్డులు సృష్టించాడు. మెగా వేలంలో ఆ జట్టు చాలా మంది గొప్ప ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ జట్టు చాలా బలంగా ఉందని నిరూపించుకోవచ్చు.

3. కోల్‌కతా నైట్ రైడర్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గత సంవత్సరం తమ కెప్టెన్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత కేకేఆర్ జట్టు వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా కొనుగోలు చేసింది. అయ్యర్ చాలా కాలం పాటు ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

4. పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్సీ చాలా కాలం పాటు కేఎల్ రాహుల్ చేతిలోనే ఉంది. అయితే గత సీజన్ తర్వాత కేఎల్ రాహుల్ జట్టును వీడాడు. దీని తర్వాత, ఫ్రాంచైజీ జట్టు కమాండ్‌ను ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు అప్పగించింది. మరి కెప్టెన్‌ని మార్చడం వల్ల జట్టు భవితవ్యం మారుతుందేమో చూడాలి.

5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్సీని ఫాఫ్ డు ప్లెసిస్‌కు అప్పగించినట్లు ఇటీవల ప్రకటించింది. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత సుదీర్ఘ ఆలోచనలు జరిగాయి. చివరకు డు ప్లెసిస్‌కు కమాండ్ అప్పగించాలని నిర్ణయించారు.

Also Read: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ వచ్చేసింది.. ఇన్ని స్టంట్స్ ఎందుకో బ్రో అంటోన్న ఫ్యాన్స్..

IPL Bio-Bubble: బయో బబుల్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్.. రిపీటైతే టోర్నీ నుంచే ఔట్.. షాకిస్తోన్న బీసీసీఐ కొత్త రూల్స్..