Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: టీమిండియా మాజీ ప్లేయర్ సరికొత్త ఇన్నింగ్స్.. ఆ ఫ్రాంచైజీతో ఐపీఎల్‌ 2022లో రీ ఎంట్రీ..!

Gautam Gambhir: తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ని రెండుసార్లు ఛాంపియన్‌గా మార్చాడు. అతని కెప్టెన్సీలో కేకేఆర్ 2012లో..

IPL 2022: టీమిండియా మాజీ ప్లేయర్ సరికొత్త ఇన్నింగ్స్.. ఆ ఫ్రాంచైజీతో ఐపీఎల్‌ 2022లో రీ ఎంట్రీ..!
Gautam Gambhir
Follow us
Venkata Chari

|

Updated on: Dec 19, 2021 | 9:13 AM

IPL 2022 Mega Auction: కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను జట్టు మెంటార్‌గా నియమించింది. ఐపీఎల్‌లో తొలిసారిగా గంభీర్ ఒక జట్టుతో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల, లక్నో జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘అవును, మేం గౌతమ్ గంభీర్‌ని మెంటార్‌గా తీసుకున్నాం’ అని పేర్కొన్కాడు.

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన గౌతమ్ గంభీర్ తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ని రెండుసార్లు ఛాంపియన్‌గా మార్చాడు. అతని కెప్టెన్సీలో కేకేఆర్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో, 2014లో పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 129 మ్యాచ్‌లు ఆడి 71 విజయాలు సాధించాడు. 57 మ్యాచుల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

రూ. 7090 కోట్లతో లక్నో జట్టు.. ఆర్‌పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ లక్నో జట్టును రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేసింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ లీగ్‌కి తిరిగి వస్తోంది. దీనికి ముందు, గోయెంకా గ్రూప్ 2016, 2017 రెండేళ్లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టును కలిగి ఉంది. అదే సమయంలో, సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ నుంచి రూ. 5,166 కోట్లతో జట్టును కొనుగోలు చేసింది.

గంభీర్ 2007, 2011 ప్రపంచ కప్‌లలో సత్తా.. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. ఈ విజయంలో గంభీర్‌దే కీలకపాత్ర. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు అద్భుత బ్యాటింగ్ చేశాడు. పాకిస్థాన్‌పై గౌతమ్‌ బ్యాటింగ్‌లో 75 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు ఈ మ్యాచ్‌లో పుంజుకోగలిగింది.

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో సచిన్‌, సెహ్వాగ్‌లను తొందరగా ఔట్ చేసిన తర్వాత గంభీర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శ్రీలంకపై 97 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మలిచాడు.

Also Read: 24 సిక్స్‌లు 50 ఫోర్లు 637 పరుగులు.. వెంటనే ఆ ఆటగాడికి CSK నుంచి పిలుపొచ్చింది..

‌HBD Ricky Ponting: 2003లో భారత అభిమానుల కన్నీటికి కారణమైన ఆసీస్ సారథి.. 3 ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచాడు..!