AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఢిల్లీ జట్టుకు మరోషాక్.. హాస్పిటల్‌లో చేరిన కీలక ప్లేయర్.. ఎందుకంటే?

ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో..

IPL 2022: ఢిల్లీ జట్టుకు మరోషాక్.. హాస్పిటల్‌లో చేరిన కీలక ప్లేయర్.. ఎందుకంటే?
Prithvi Shaw
Venkata Chari
|

Updated on: May 08, 2022 | 5:59 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)లో భాగమైన పృథ్వీ షా హాస్పిటల్ పాలయ్యాడు. ఈమేరకు ఆదివారం, పృథ్వీ షా ఆసుపత్రి నుంచి తన ఫోటోను సోషల్ మీడయాలో పంచుకున్నాడు. పృథ్వీ షా చివరి మ్యాచ్ ఆడలేకపోయాడని తెలిసిందే. కాగా, ఈరోజు అంటే ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పృథ్వీ షా ఆడడం కష్టమేనని తెలుస్తోంది.

Also Read: IPL 2022: 4 ఏళ్ల చెత్త రికార్డులో చేరిన కేకేఆర్ బౌలర్.. అదేంటంటే?

పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలో, అతను ఆసుపత్రి బెడ్‌పై పడుకున్నట్లు చూడొచ్చు.’ తాను జ్వరం నుంచి కోలుకుంటున్నానని, ఆసుపత్రిలో చేరానని’ పృథ్వీ క్యాప్షన్ అందించాడు. ‘త్వరలో తిరిగి మైదానంలోకి వస్తానని, మీ ప్రార్థనలకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు.

ఆదివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. అయితే అంతకుముందే జట్టులో కరోనా మరోసారి పంజా విసిరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన నెట్ బౌలర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత అతనితోపాటు రూమ్‌మేట్‌ను ఐసోలేషన్‌లో ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్‌లో గతంలో అర డజను కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కొంతమంది ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే ఇప్పుడు అంతా దాని నుంచి కోలుకున్నారు.

Also Read: IPL 2022: 12 వికెట్లు, 184 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. జట్టంతా విఫలమైనా.. వన్ మ్యాన్ ఆర్మీలా మారిన రూ. 12 కోట్ల ఆల్ రౌండర్..

IPL 2022: సరికొత్త రికార్డు దిశగా రాజస్తాన్ రాయల్స్ బౌలర్.. కేవలం మరో 6 అడుగుల దూరంలోనే.. అదేంటంటే?