రోహిత్ శర్మకు జరిమానా
మొహాలి: ముంబయి ఇండియన్స్- కింగ్స్లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ (71 నాటౌట్; 57 బంతుల్లో 6×4, 1×6) బ్యాటింగ్కు.. క్రిస్ గేల్ (40; 24 బంతుల్లో 3×4, 4×6) తోడవ్వడంతో పంజాబ్ జట్టు ఈ సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ముంబయి ఇండియన్స్కు పరాజయంతో పాటు జరిమానా కూడా పడింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు యాజమాన్యం రూ.12లక్షల […]
మొహాలి: ముంబయి ఇండియన్స్- కింగ్స్లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ (71 నాటౌట్; 57 బంతుల్లో 6×4, 1×6) బ్యాటింగ్కు.. క్రిస్ గేల్ (40; 24 బంతుల్లో 3×4, 4×6) తోడవ్వడంతో పంజాబ్ జట్టు ఈ సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ముంబయి ఇండియన్స్కు పరాజయంతో పాటు జరిమానా కూడా పడింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు యాజమాన్యం రూ.12లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఫైన్ పడింది. ఈ సీజన్లో ఒక జట్టుకు జరిమానా పడటం ఇదే తొలిసారి.