AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనతో ప్రమాదంలో పడిన ఆ ఆటగాళ్ల భవిష్యత్తు.. ఎవరు వారు..

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్, వన్డే సిరీస్ ఓడిపోయింది. దీంతో పలువురి ఆటగాళ్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది...

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనతో ప్రమాదంలో పడిన ఆ ఆటగాళ్ల భవిష్యత్తు.. ఎవరు వారు..
Icc Under 19 World Cup 2022 India 6 Players Covid 19 Positive
Srinivas Chekkilla
|

Updated on: Jan 24, 2022 | 5:43 PM

Share

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్, వన్డే సిరీస్ ఓడిపోయింది. దీంతో పలువురి ఆటగాళ్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యంత కష్టతరమైన దశను ఎదుర్కొంటున్నాడు. అతను ఇప్పటికే అన్ని ఫార్మట్లలో కెప్టెన్సీని వైదొలిగాడు. అతను మూడో టెస్టులో 79 పరుగులు చేశాడు. ODIలలో కూడా అతను రెండు అర్ధ సెంచరీలు చేసాడు కానీ అతను సరైన ఫామ్​లో లేనట్లు కనిపిస్తోంది. కేప్ టౌన్ టెస్ట్‌లో DRS అనుకూలంగా లేని నిర్ణయం తీసుకున్నందుకు బ్రాడ్‌కాస్టర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అతని ప్రతిష్టను దెబ్బతీసింది. మ్యాచ్‌లో భారత్ తిరిగి వచ్చే అవకాశాలను దెబ్బతీసింది.

టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడు కానీ అతని వారసుడిగా భావించిన రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. రాహుల్‌ రెండో వన్డేలో 79 బంతుల్లో 55 పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరూ ఆరు ఇన్నింగ్స్‌లలో 200 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇప్పుడు వారి కెరీర్‌లు నిస్సందేహంగా ముగింపు దశకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

Read Also.. IND vs SA: భారత్​కు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధింపు..