AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ఆ విషయంలో టీమిండియాను హెచ్చరించిన యువరాజ్ సింగ్.. ఏమన్నాడంటే?

Yuvraj Singh: మనం ఐసీసీ ట్రోఫీని గెలిచి చాలా కాలం అయ్యింది. రెండు ఫైనల్స్ (2021, 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఆడాం. జట్టులోని కొంతమందికి ఇదే చివరి ప్రపంచ కప్ అని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచకప్ గెలవాలంటే ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ఫణంగా పెట్టి అన్నీ ఇవ్వాలి. ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. సెమీ-ఫైనల్ దశకు చేరుకుంటే, బిగ్ మ్యాచ్‌లో నేరుగా ఒత్తిడిని ఎదుర్కొంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

World Cup 2023: ఆ విషయంలో టీమిండియాను హెచ్చరించిన యువరాజ్ సింగ్.. ఏమన్నాడంటే?
Team India
Venkata Chari
|

Updated on: Sep 30, 2023 | 6:59 AM

Share

Team India: సొంతగడ్డపై 2011 ప్రపంచకప్ గెలిచిన భారత్ క్యాంపెయిన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువరాజ్ సింగ్.. ప్రస్తుత జట్టులోని ప్రతి సభ్యుడు రాబోయే 2023 ప్రపంచకప్‌ను గెలవాలనే ఒత్తిడిలో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. దానిని నిర్వహించడానికి, శరీరాన్ని ఫణంగా పెట్టాలంటూ సూచించాడు. ఎందుకంటే, ఐసీసీ టోర్నమెంట్‌ను భారత్ గెలిచి పదేళ్లకు పైగా గడిచిందని, చివరిసారిగా ఇంగ్లండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ గెలుచుకుందంటూ చెప్పుకొచ్చాడు.

టీమ్ ఇండియాను హెచ్చరించిన యువరాజ్ సింగ్..

ఐఎఎన్‌ఎస్‌తో జరిగిన సంభాషణలో యువరాజ్ మాట్లాడుతూ, ‘మనం ఐసీసీ ట్రోఫీని గెలిచి చాలా కాలం అయ్యింది. రెండు ఫైనల్స్ (2021, 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఆడాం. జట్టులోని కొంతమందికి ఇదే చివరి ప్రపంచ కప్ అని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచకప్ గెలవాలంటే ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ఫణంగా పెట్టి అన్నీ ఇవ్వాలి. ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. సెమీ-ఫైనల్ దశకు చేరుకుంటే, బిగ్ మ్యాచ్‌లో నేరుగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇందుకోసం ముందునుంచే ప్రిపేర్ కావాలంటూ హితవు పలికాడు.

ఇవి కూడా చదవండి

ఈ జట్లు భారత్‌కు ప్రమాదకరం..

1983, 2011 ఛాంపియన్‌గా ఉన్న భారత్, ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు భారత్‌కు గట్టి సవాల్‌ని అందించగలవని యువరాజ్‌ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియా ఎప్పుడూ బలమైన జట్టు అని, గతంలో కూడా ఎన్నో టైటిళ్లను గెలుచుకుంది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లను గెలిపించగల సత్తా వారికి ఉంది. న్యూజిలాండ్ చాలా మంచి జట్టు, ఇంగ్లాండ్ కూడా చాలా మంచి వన్డే జట్టు, ప్రస్తుతం ఆఫ్రికా కూడా మంచి ప్రదర్శన చేస్తోందంటూ తెలిపాడు.

బౌలర్లు కీలక సహకారం అందించాలి..

మ్యాచ్ గెలవడంలో బౌలర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. పోటీ సమయంలో మంచు కీలక పాత్ర పోషిస్తుందని అన్నాడు. ‘విషయం ఏమిటంటే చాలా మ్యాచ్‌లు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి. నవంబర్‌లో వాతావరణం మారనుంది. కొన్ని మ్యాచ్‌లలో, ఇది స్వింగ్ కావచ్చు, సాయంత్రం మంచు ప్రభావం చూపుతుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు చాలా ముఖ్యమైన బౌలర్లని నేను ఎప్పుడూ భావిస్తాను. పది వికెట్లు తీయగల మంచి బౌలర్లు మన వద్ద ఉన్నారని నా అభిప్రాయం. ఈ ప్రపంచకప్‌లో బౌలర్లు చాలా మ్యాచ్‌లను గెలిస్తారంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..