AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th Test: నల్ల బ్యాడ్జీలతో బరిలోకి భారత జట్టు.. కారణం ఏంటో తెలుసా?

Australia vs India, 4th Test: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సిరీస్ పరంగా రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. WTC ఫైనల్‌లో స్థానం కోసం ఇరుజట్లు తమ ఆధిపత్యాన్ని చూపించాల్సి ఉంటుంది.

IND vs AUS 4th Test: నల్ల బ్యాడ్జీలతో బరిలోకి భారత జట్టు.. కారణం ఏంటో తెలుసా?
Ind Vs Aus 4th Test Indian Team Wearing Black Bands
Venkata Chari
|

Updated on: Dec 27, 2024 | 7:14 AM

Share

Australia vs India, 4th Test: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సిరీస్ పరంగా రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. WTC ఫైనల్‌లో స్థానం కోసం ఇరుజట్లు తమ ఆధిపత్యాన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే, తొలి రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సామ్ కాన్స్టాస్ తుఫాన్ బ్యాటింగ్‌, స్టీవ్ స్మిత్ క్లాసిక్ ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియాను డ్రైవర్ సీటులో కూర్చోబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒకానొక దశలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు దూరమయ్యేలా కనిపించింది. అయినప్పటికీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్పెల్‌తో భారత జట్టును తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. దీంతో తొలిరోజు ముగిసే సమయానికి, ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68, పాట్ కమిన్స్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇక రెండో రోజు 49 పరుగుల వద్ద కమ్మిన్స్ పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 453 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌తో బరిలోకి భారత జట్టు..

రెండో రోజు ప్రారంభంలో, భారత జట్టు చేతికి నల్లని బ్యాండ్ ధరించి కనిపించింది. ఆటగాళ్లందరి చేతులపైనా నల్లని బ్యాండ్ కనిపించింది. అందుకు గల కారణం భారత్ నుంచి వచ్చింది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, 92 సంవత్సరాల వయస్సులో, ఆయన తన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 9:51 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాజీ ప్రధానికి నివాళులర్పించేందుకుగాను భారత జట్టు నల్లటి బ్యాండ్‌లతో బరిలోకి దిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..