AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. అక్కడే ఆడాలంటూ పీసీబీ కొత్త మెలిక..

India vs Pakistan: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగే సమావేశంలో ఆసియా కప్ వేదికను నిర్ణయిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా గురువారం తెలిపారు.

Asia Cup 2023: భారత్, పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం.. అక్కడే ఆడాలంటూ పీసీబీ కొత్త మెలిక..
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: May 25, 2023 | 7:07 PM

Share

India vs Pakistan: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగే సమావేశంలో ఆసియా కప్ వేదికను నిర్ణయిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా గురువారం తెలిపారు. ఈ సమావేశంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఆసియా కప్ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జై షా తెలిపారు. మేం ఐపీఎల్ నిర్వహణలో బిజీగా ఉన్నాం. అయితే ఇప్పుడు శ్రీలంక క్రికెట్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారులు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రానున్నారు. దీనిపై చర్చించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ ఏడాది ఆసియా కప్ 2023కి ఆతిథ్యమిచ్చే దేశం పాకిస్థాన్ అనే విషయం తెలిసిందే. ఇదే విషయంలో బీసీసీఐ, పీసీబీల మధ్య వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బీసీసీఐ భారత జట్టును పొరుగు దేశాలకు పంపడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితిలో పీసీబీ ఛైర్మన్ నజం సేథీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఏసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. నజామ్ సేథీ ఫార్ములా ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ ల సిరీస్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరగనున్నాయి. కాబట్టి భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడుతుంది. శ్రీలంకలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇక్కడే మరో సమస్య ఇరు బోర్డులపై ఉద్రిక్తత నెలకొంది. ఈ మ్యాచ్‌ని దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది.

ఇవి కూడా చదవండి

ఏసీసీ వర్గాల సమాచారం ప్రకారం ఏసీసీ చీఫ్ జై షా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడే తుది నిర్ణయం తీసుకోనున్నారు. తటస్థ వేదికపై భారత్‌తో ఆడేందుకు పీసీబీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మ్యాచ్‌ను దుబాయ్‌లోనే నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ సంవత్సరం, ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20..
రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..