AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇది కదా బ్యాడ్‌లక్ అంటే.. ఔట్ అవ్వాల్సింది ఒకరు.. పెవిలియన్ చేరింది మరొకరు.. ఇదెక్కడి విచిత్రం భయ్యా..

శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఒమన్ ఆసియా కప్ 2025లో గ్రూప్ ఏ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ సందర్భంగా, భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఒక నాటకీయ సీన్ చోటు చేసుకుంది. నిజానికి, సంజు శాంసన్ అవుట్ అవ్వాల్సిన బంతి హార్దిక్ పాండ్యాకు హార్ట్ బ్రేక్‌గా మారింది.

Video: ఇది కదా బ్యాడ్‌లక్ అంటే.. ఔట్ అవ్వాల్సింది ఒకరు.. పెవిలియన్ చేరింది మరొకరు.. ఇదెక్కడి విచిత్రం భయ్యా..
Sanju Samson Vs Hardik Pandya
Venkata Chari
|

Updated on: Sep 20, 2025 | 12:58 PM

Share

Sanju Samson vs Hardik Pandya: శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, ఒమన్ జట్లు గ్రూప్ ఏలో భాగంగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా, భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో నాటకీయ క్షణం ఆవిర్భవించింది. సంజు శాంసన్‌ను ఔట్ చేయాల్సిన బంతి హార్దిక్ పాండ్యాకు ఎండ్ కార్డ్‌గా మారింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దురదృష్టవశాత్తు హార్దిక్ పాండ్యా కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఆసియా కప్ 2025 గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్ ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.

మ్యాచ్‌లో ఈ అద్భుతమైన నాటకం..

భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో సంజు శాంసన్ హార్దిక్ పాండ్యాకు హృదయ విదారక పరిస్థితిని కల్పించాడు. ఈ ఓవర్‌ను ఒమన్ తరపున బౌలింగ్ చేయడానికి మీడియం పేసర్ జితెన్ రామనంది వచ్చాడు. ఆ ఓవర్ లో మూడో బంతికి సంజు శాంసన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. బంతి గాలిలో ఉంది. జితెన్ రామనంది దానిని క్యాచ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, బంతి జితెన్ రామనంది చేతిని తాకింది. నాన్-స్ట్రైకర్ ఎండ్ వద్ద స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా క్రీజులో లేడు. దీంతో, హార్దిక్ పాండ్యా దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

సంజు శాంసన్ వల్ల హార్దిక్ పాండ్యా హార్ట్ బ్రేక్..

జితెన్ రామానంది సంజు శాంసన్ స్ట్రెయిట్ డ్రైవ్ క్యాచ్ పట్టుకుని ఉంటే, అతను అవుట్ అయ్యేవాడు. కానీ, అదే బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో హార్దిక్ పాండ్యాను రనౌట్ చేసింది. హార్దిక్ పాండ్యాకు ఇది ఒక పీడకల. అతను తన తప్పు లేకుండానే అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే, ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా పటిష్టంగా బౌలింగ్ చేశాడు. అతను 4 ఓవర్లలో 26 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. కాగా, ఈ బంతికి సంజు శాంసన్ ప్రాణం పోసుకున్నాడు. ఒమన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సంజు సామ్సన్ 45 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

మ్యాచ్ ఫలితం..

ఈ మ్యాచ్‌లో భారత్ ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఒమన్ ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ఓమన్ బ్యాటర్స్ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. కెప్టెన్ జతీందర్ ఇన్నింగ్స్ నెమ్మదిగా లేకపోతే, ఫలితం వేరేలా ఉండేది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ 4 వికెట్లకు 167 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. భారత తరపున తరపున హార్దిక్, హర్షిత్, కుల్దీప్, అర్ష్‌దీప్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. సెప్టెంబర్ 21 ఆదివారం సూపర్-4 దశలో భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..