AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్‎లో సెంచరీ కొట్టిన భారత్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్య

IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో 20 సమరానికి తెరలేచింది. ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే భారత గడ్డపై టీమిండియా ఆడుతున్న 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇది.

IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్‎లో సెంచరీ కొట్టిన భారత్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్య
Ind Vs Nz 2nd T20
Rakesh
|

Updated on: Jan 23, 2026 | 6:39 PM

Share

IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో 20 సమరానికి తెరలేచింది. ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే భారత గడ్డపై టీమిండియా ఆడుతున్న 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇది. ఈ చారిత్రాత్మక పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో పాటు, ఇక్కడ ఛేజింగ్ సులభం అనే ఉద్దేశంతో కివీస్‌ను ముందే బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

టీమిండియా నేడు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఒక అరుదైన ఘనతను అందుకుంటోంది. స్వదేశంలో 100వ టీ20 మ్యాచ్ ఆడుతున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, నేడు గెలిస్తే సిరీస్‌పై పట్టు సాధిస్తుంది. రాయ్‌పూర్ పిచ్ గతంలో బ్యాటింగ్‌కు అనుకూలించిన దాఖలాలు ఉన్నాయి. 2023లో ఇక్కడ ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, అదే సెంటిమెంట్‌ను నేడు కూడా కొనసాగించాలని భావిస్తోంది. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన సూర్య తెలివిగా బౌలింగ్ తీసుకున్నాడు, తద్వారా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులభం అవుతుంది.

గణాంకాల పరంగా చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 26 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 15 సార్లు విజయం సాధించగా, కివీస్ 10 సార్లు గెలిచింది. ఇక భారత గడ్డపై ఆడిన 12 మ్యాచ్‌లలో భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కివీస్ జట్టు భారత్‌లో కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది. ఈ రికార్డులు చూస్తుంటే నేటి మ్యాచ్‌లో కూడా భారత్‌దే పైచేయి అనిపిస్తోంది. వరల్డ్ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.

భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, హార్దిక్ పాండ్యా వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి పటిష్టంగా కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొనగా, తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా తన జట్టును సిరీస్‌లో నిలబెట్టడానికి గ్లెన్ ఫిలిప్స్, డెవాన్ కాన్వే వంటి సీనియర్లపై ఆశలు పెట్టుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..