AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: రోకో ఎఫెక్ట్.. 8 నిమిషాల్లోనే భారత్, కివీస్ తొలి వన్డే టిక్కెట్స్ క్లోజ్..

India vs New Zealand 1st ODI: భారత జట్టు జనవరి రెండో వారం నుంచి న్యూజిలాండ్ జట్టుతో వైల్ బాల్ సిరీస్ ఆడనుంది. అయితే, వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడనున్నారు. ఈ మేరకు ఇండోర్‌లో జరగబోయే తొలి మ్యాచ్‌ టిక్కెట్స్ కేవలం 8 నిమిషాల్లోనే అమ్ముడవ్వడం గమనార్హం.

IND vs NZ: రోకో ఎఫెక్ట్.. 8 నిమిషాల్లోనే భారత్, కివీస్ తొలి వన్డే టిక్కెట్స్ క్లోజ్..
Ind Vs Nz Odi
Venkata Chari
|

Updated on: Jan 02, 2026 | 1:27 PM

Share

India vs New Zealand 1st ODI: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి వన్డే మ్యాచ్ టిక్కెట్లు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు బుక్‌మైషోలో టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నిమిషాల్లోనే టిక్కెట్లు అమ్ముడుపోయాయని అభిమానులు గమనించారు.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే మూడవ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం జనవరి 3న ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 18న జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు www.district.in ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని MPCA పేర్కొంది. ఒక్కొక్కరికి గరిష్టంగా నాలుగు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వన్డే టిక్కెట్లంటే అభిమానులకు ఎందుకు అంత పిచ్చి?

న్యూజిలాండ్ జట్టు భారతదేశానికి వస్తోంది. జనవరి 11న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లలో ఆడనున్నారు. కాబట్టి, అభిమానులు వన్డేలకు టిక్కెట్లు పొందడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వారు ఇప్పుడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ బరోడాలో, ఆ తర్వాత రాజ్‌కోట్, ఇండోర్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

తక్కువ టికెట్ ధర రూ. 800లు కాగా, అత్యంత ఖరీదైన టికెట్ రూ. 7,000లుగా ఉంది. అన్ని టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, ఆన్‌లైన్ టికెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రేక్షకుల ఇళ్లకు కొరియర్ ద్వారా డెలివరీ చేయనున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..