AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: నాలుగో టెస్టు బరిలో టీమిండియా స్టార్ బౌలర్.. గెలవాలంటే మార్పులు తప్పవంటోన్న విరాట్ కోహ్లీ..!

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం అయింది. ఈకారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

IND vs ENG: నాలుగో టెస్టు బరిలో టీమిండియా స్టార్ బౌలర్.. గెలవాలంటే మార్పులు తప్పవంటోన్న విరాట్ కోహ్లీ..!
Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Aug 30, 2021 | 1:22 PM

Share

IND vs ENG: టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఓటమి తర్వాత భారత జట్టులో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయని భావిస్తున్నారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరిక ఖచ్చితంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఇషాంత్ శర్మపై వేటు పడేలా ఉందని సమాచారం. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ మార్పు జరగనుందని సమాచారం. ఇంగ్లండ్ మూడో మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ 22 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చీలమండ గాయం, కండరాల ఒత్తిడి కారణంగా ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. అతను మూడో టెస్ట్ సమయంలో పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలియదు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇషాంత్ ప్రదర్శనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. కానీ, ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సి ఉంటుందని సూచించాడు. మొదటి టెస్టులో ఇషాంత్ శర్మ ఆడలేదు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను మొత్తం 56 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో అతనికి ఐదు వికెట్లు లభించాయి. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి ఇప్పటివరకు జరిగిన మూడవ లేదా నాల్గవ స్పెల్ సమయంలో ఇషాంత్ అంత ప్రభావం చూపించలేకపోయాడు.

జడేజా ఆడడం కూడా.. ఇదిలా ఉండగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి స్కాన్‌లో అతనికి తీవ్రమైన గాయం కాలేదని తేలింది. అయితే ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో జరిగే నాల్గవ టెస్ట్ కోసం జట్టులో బలమైన పోటీదారుగా ఉన్నాడు. భారతదేశం ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ, కౌంటీ మ్యాచ్‌లో ఈ మైదానంలో అశ్విన్ ఆడిన సర్రే జట్టు బాగా రాణించింది. ఈ మ్యాచ్ కోసం అతను కచ్చితంగా బరిలో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇషాంత్ తప్పుకుంటే, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు.

శార్దూల్‌కు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. కానీ, ఉమేష్ యాదవ్ అతని కంటే మెరుగైన బౌలర్. అటువంటి పరిస్థితిలో, మొహమ్మద్ షమీ లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరికి విశ్రాంతి ఇస్తారో చూడాలి. కానీ, ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లో, ఈ ఇద్దరు బౌలర్లు అద్భుతంగా రాణించారు.

Also Read:

అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన టీమిండియా ఆల్‌రౌండర్.. 2014లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.. అతనెవరో తెలుసా!

IND vs ENG: నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీంలో రెండు మార్పులు.. వికెట్ కీపర్ ఔట్.. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ భాగస్వామి

భారత్‌లోనే పుట్టాడు.. కానీ, విదేశీ జట్టు కెప్టెన్‌‌గా ఎదిగాడు.. ప్రస్తుతం ఇండియాలో ఆడేందుకు సొంత జట్టునే వదిలిపెట్టాడు.. అతనెవరంటే?