AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆస్ట్రేలియాకు బ్యాడ్‌న్యూస్.. వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న కెప్టెన్.. మరోసారి జట్టు పగ్గాలు ఆయనకే..

India vs Australia: ఢిల్లీలో రెండో టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన పాట్ కమిన్స్ ఇప్పుడు భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాకు బ్యాడ్‌న్యూస్.. వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న కెప్టెన్.. మరోసారి జట్టు పగ్గాలు ఆయనకే..
Ind Vs Aus Odi
Venkata Chari
|

Updated on: Mar 14, 2023 | 11:19 AM

Share

భారత్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిన పాట్ కమిన్స్.. ఇప్పుడు భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే సిరీస్ కోసం అతడు భారత్‌కు తిరిగి రావడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో వన్డే సిరీస్‌కూ స్మిత్ సారథిగా ఉంటాడని భావిస్తున్నారు.

పాట్ కమిన్స్ తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన కమిన్స్.. ఆ తర్వాత తల్లి మరణంలో మరలా భారత్‌కు రాలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్‌లో కమిన్స్‌ స్థానంలో కెప్టెన్‌గా స్మిత్‌..

పాట్ కమిన్స్ గైర్హాజరీలో మరోసారి స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్‌లో సారథ్యం వహించనున్నాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఇండోర్ టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత WTC ఫైనల్‌కు టిక్కెట్‌ను పొందింది. ఇప్పుడు స్మిత్ ముందు వన్డే సిరీస్ గెలవాల్సిన బాధ్యత నెలకొంది.

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీని చేపట్టాడు. ఇప్పటి వరకు కేవలం 2 వన్డేల్లోనే ఆస్ట్రేలియా కమాండ్‌ని అందుకున్నాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 ODIల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ మార్చి 17న ముంబైలో జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌ మార్చి 19న జరగనుంది. అదే సమయంలో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 22న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..