AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 గంటల క్రితం రోహిత్ షాకింగ్ నిర్ణయం.. ఆ తర్వాత మరో 3.. కట్‌చేస్తే.. వడ్డీతో ఇచ్చిపడేసిన అడిలైడ్

Adelaide Test: అడిలైడ్‌లో జరిగిన టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లలో ఏ బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా బౌలింగ్ కూడా పేలవంగా కనిపించడంతో ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకుంది.

50 గంటల క్రితం రోహిత్ షాకింగ్ నిర్ణయం.. ఆ తర్వాత మరో 3.. కట్‌చేస్తే.. వడ్డీతో ఇచ్చిపడేసిన అడిలైడ్
Rohit Sharma Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Dec 08, 2024 | 1:23 PM

Share

IND vs AUS: కేవలం 7 సెషన్‌లు అంటే 3 పూర్తి రోజులు కూడా కాలేదు. అడిలైడ్ టెస్టులో ఫలితం రావడానికి చాలా తక్కువ సమయం పట్టింది. కానీ, ఈ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మూడో రోజు తొలి సెషన్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 19 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 ఓవర్లలోనే సాధించింది. డే-నైట్ టెస్టులో ఎప్పటిలాగే ఆస్ట్రేలియా ఆటతీరు అద్భుతంగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఎందుకు ఓడిపోయింది. దానికి కారణాలు ఏమిటి? అని తెలుసుకుందాం. రోహిత్ శర్మ నిర్ణయాలే ఇందులో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయడం..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటి నుంచి ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం స్పష్టంగా ఉంది – వాతావరణం బాగా లేదు. అడిలైడ్ టెస్ట్ మొదటి రోజు మేఘావృతమైంది. ఇటువంటి పరిస్థితిలో, చాలా స్వింగ్, సీమ్ ఉన్న పింక్ బాల్ ఫాస్ట్ బౌలర్లకు మరింత సహాయపడుతుందని భావించారు. అదే జరిగింది. మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను నాశనం చేశాడు. మొత్తం జట్టు కేవలం 180 పరుగులకే కుప్పకూలింది.

2. ప్లేయింగ్ 11లో తప్పులు..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం తప్పుడు నిర్ణయమైతే, టీమ్ ఇండియా జట్టు ఎంపికలోనూ తప్పు చేసింది. ఈ టెస్ట్‌కు హర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్‌ని ఎంపిక చేయాలని ఇప్పటికే చాలామంది నిపుణులు సూచించారు. దీనికి కారణం పెర్త్‌లో హర్షిత్ తప్పిదాలు కాదు, పింక్ బాల్‌కు అవసరమైన నైపుణ్యం లేదు. ఆకాష్ దీప్ ఈ టాస్క్‌లో మెరుగ్గా ఉండేవాడు. ఎందుకంటే, అతను పిచ్ నుంచి సహాయం పొందగలిగాడు. పింక్ బాల్‌తో అతను ఇందులో మరింత ప్రమాదకరంగా నిరూపించబడ్డాడు. కానీ, షార్ట్ పిచ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో ఎక్కువగా సక్సెస్ అయిన హర్షిత్‌ను జట్టు ఎంపిక చేసింది. కానీ, ఇక్కడ అది అవసరం లేదు. ఫలితం కనిపించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హర్షిత్‌పై సులభంగా పరుగులు సాధించారు.

ఇవి కూడా చదవండి

3. అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం..

గత కొంతకాలంగా, జట్టులోని సీనియర్ బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం పెద్ద ఆందోళనగా మారింది. అడిలైడ్‌లో కూడా అదే జరిగింది. పెర్త్ టెస్టులో బలమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి ఇక్కడ ఘోరంగా విఫలమయ్యారు. రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా స్ట్రాంగ్‌గా కనిపించినా పెద్ద స్కోరుగా మార్చలేకపోయాడు. అదే సమయంలో, విరాట్ ఆఫ్-స్టంప్ వెలుపల, ఫ్రంట్ ఫుట్‌లో బంతిని ఆడే అలవాటును మానుకోలేదు. 7, 11 మాత్రమే స్కోర్ చేయగలడు. తిరిగి జట్టులోకి వచ్చి మిడిలార్డర్‌లోకి అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం మరిచిపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలర్లు రోహిత్ బలహీనతను సొమ్ము చేసుకున్నారు. రోహిత్ 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

4. బుమ్రా ప్రభావవంతంగా ఉన్నా.. సరిగ్గా ఉపయోగించుకోలే..

తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే టీమిండియాకు అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా కనిపించాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం ఆకట్టుకుని 4 వికెట్లు పడగొట్టాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వాడుకున్న తీరు ప్రశ్నలకు తావిస్తోంది. రెండో రోజు తొలి సెషన్ ప్రారంభంలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టాడు. కానీ, ఆ సెషన్‌లో రోహిత్ అతనిని 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. మరోవైపు హర్షిత్ రానా దారాలంగా పరుగులు ఇస్తూనే ఉన్నా.. బుమ్రాను వెనక్కి తీసుకురాలేదు. మహ్మద్ సిరాజ్ బాగా ప్రారంభించాడు. కానీ, అతను తన లయను కోల్పోయాడు. 4 వికెట్లు సాధించినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us