AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా.. పూర్తి వివరాలివే..

నాలుగు టెస్టుల బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న..

IND vs AUS 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా.. పూర్తి వివరాలివే..
Ind Vs Aus 4th Test 2023
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 13, 2023 | 4:31 PM

Share

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. ఫలితంగా నాలుగు టెస్టుల బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా సిరీస్ 2-1 తేడాతో ఉంది. అనంతరం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ భారత్ సొంతం అయింది.

అయితే ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(90) రాణించగా..  లబుషేన్‌(63*), స్మిత్‌(10*) చివరి వరకు కూడా క్రీజులో ఉన్నారు. అలాగే భారత బౌలర్లలో అశ్విన్‌ , అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. అలాగే అంతకముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480-10 పరుగులు చేయగా.. టీమిండియా కూడా తనదైన శైలిలో 571-10 పరుగులు చేసి 91 పరుగుల అధిక్యంతో తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా, ఈ టెస్టులో ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలు సాధించగా.. భారత్ తరఫున కూడా శుభమాన్ గిల్(128), కింగ్ కోహ్లీ(186) శతకాలతో రాణించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో ముగిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్‌ చేతిలో లంక ఓటమితో రోహిత్‌ సేన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోకి చేరింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతం, భారత్ 58.80 శాతంతో వరుసగా రెండుస్థానాల్లో నిలిచాయి.  దీంతో అటు టీమిండియా ఆటగాళ్లు, ఇటు భారత్‌లోని క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..