AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 1st ODI: టాస్ గెలిచిన హార్దిక్.. కీలక ప్లేయర్లు రీఎంట్రీ.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది.

IND vs AUS 1st ODI: టాస్ గెలిచిన హార్దిక్.. కీలక ప్లేయర్లు రీఎంట్రీ.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
India Vs Australia 1st Odi
Venkata Chari
|

Updated on: Mar 17, 2023 | 1:12 PM

Share

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు బాధ్యతలు చేపట్టాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కుటుంబ కారణాల రీత్యా ఈ సిరీస్‌లోని తొలి వన్డే నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకున్నట్లు బీసీసీఐ ఇప్పటికే తెలిపింది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచకప్ సన్నాహాలపైనే టీమిండియా దృష్టి సారించింది. మూడేళ్ల తర్వాత ఈ మైదానంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత జట్టు ఒక్కటి మాత్రమే గెలవగలిగింది. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చివరిసారిగా 2020లో ఇక్కడ ఇరు జట్లు ముఖాముఖి తలపడినప్పుడు కంగారూ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

గత ఆరు వన్డేల్లో శుభ్‌మాన్ మూడు సెంచరీలు..

శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన రెండు వేర్వేరు వన్డే సిరీస్‌లలో మొత్తం ఆరు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు ఈ ఏడాది ఘనంగా ప్రారంభించింది. ఈ ఆరు వన్డేల్లో శుభ్‌మన్ గిల్ మూడు సెంచరీలు, 113.40 సగటుతో 567 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి ఈ ఏడాది 67.60 సగటుతో 338 పరుగులు చేశాడు.

కెప్టెన్ పాట్ కమిన్స్ లేకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్ గెలిచే సత్తా వార్నర్, అగర్‌లతో కూడిన ఆస్ట్రేలియా జట్టుకు ఉంది. కమిన్స్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌కు కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేరు. డేవిడ్ వార్నర్, ఆల్ రౌండర్ అష్టన్ అగర్ జట్టులో చేరారు.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 143 వన్డేల్లో భారత జట్టు కేవలం 53 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 80 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అదే సమయంలో భారత్‌లో ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో టీమిండియా 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 30 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుస్‌చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..