AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: ఐపీఎల్ 2025 మధ్యలో రోహిత్ శర్మకు గుడ్ న్యూస్.. ఏకంగా వాంఖడేలోనే..

Rohit Sharma Name in Wankhede Stadium Stands: ఐపీఎల్ 2025 సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మకు ఊహించని గౌరవం లభించింది. వాంఖడే స్టేడియంలోని మూడు స్టాండ్ల పేర్లు మార్చారు. ఇందులో ఓ పేరు రోహిత్ శర్మది కావడం గమనార్హం.

Rohit Sharma: ఐపీఎల్ 2025 మధ్యలో రోహిత్ శర్మకు గుడ్ న్యూస్.. ఏకంగా వాంఖడేలోనే..
Rohit Sharma Hardik Pandya
Venkata Chari
|

Updated on: Apr 16, 2025 | 12:26 AM

Share

Wankhede Stadium Stands Names: వాంఖడే స్టేడియంలోని స్టాండ్‌లకు రోహిత్ శర్మ‌తోపాటు అజిత్ వాడేకర్, శరద్ పవార్ పేర్లు పెట్టారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మంగళవారం వాంఖడే స్టేడియంలోని మూడు స్టాండ్ల పేర్లను మార్చింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ స్టాండ్‌లకు ప్రస్తుత టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్లను పెట్టింది.

ఏ స్టాండ్ల పేర్లు మార్చారు?

దివేచా పెవిలియన్ లెవల్-3ని ఇప్పుడు “రోహిత్ శర్మ స్టాండ్” అని పిలుస్తారు. గ్రాండ్ స్టాండ్ లెవల్-3ని “శరద్ పవార్ స్టాండ్” అని పిలుస్తారు. గ్రాండ్ స్టాండ్ లెవల్-4 ను “అజిత్ వాడేకర్ స్టాండ్” అని పిలుస్తారు. ముంబై క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు దిగ్గజాలు ఎంతో కృషి చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ విజయాలు అందించిన కెప్టెన్. రోహిత్ తన కెరీర్‌ను వాంఖడే నుంచి ప్రారంభించాడు.

1971లో వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లలో భారతదేశానికి తొలి టెస్ట్ సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ అజిత్ వాడేకర్.. టీమిండియా తరపున 37 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. శరద్ పవార్ మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారత క్రికెట్ కొత్త శిఖరాలను తాకింది.

వాంఖడే చారిత్రక ప్రాముఖ్యత..

2011 ప్రపంచ కప్ ఫైనల్ వంటి చారిత్రాత్మక మ్యాచ్‌లను ఆడిన వాంఖడే స్టేడియం భారత క్రికెట్‌లో అత్యంత ప్రసిద్ధ మైదానాలలో ఒకటిగా నిలిచేలా చేసింది. ఇప్పుడు ఇక్కడ స్టాండ్‌లకు పేరు పెట్టడం అనేది క్రికెట్ ప్రపంచంలోని ఈ దిగ్గజ వ్యక్తుల సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే ప్రయత్నంలో భాగమంటూ ఎంసీఏ పేర్కొంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..