Video: ఇదెక్కడి కాంబినేషన్ మావా.. బ్లాక్ క్యాప్స్ కి తోడుగా బ్లాక్ క్యాట్! చక్కర్లు కొడుతున్న ఫన్నీ వీడియో
పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ సమయంలో నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించడంతో కొన్ని నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మంచి ప్రదర్శన కనబరిచినా, జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బలహీనతలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

పాకిస్తాన్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకాల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కరాచీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో, ఓ నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించడంతో ఆట కొంతసేపు నిలిచిపోయింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, పిల్లి బౌండరీ తాళ్లను దాటి మైదానంలోకి వచ్చి కూర్చుంది. దాంతో మ్యాచ్ను కొన్ని నిమిషాలు నిలిపివేయాల్సి వచ్చింది. కెమెరాలు కూడా ఆ పిల్లిని ఫాలో అవుతూ దాని మీద ఫోకస్ చేశాయి. ఈ సంఘటనపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ డానీ మోరిసన్ చమత్కారంగా స్పందిస్తూ, “మైదానంలో బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్ జట్టు) తో నల్ల పిల్లి కలిసింది!” అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మంచి ప్రదర్శన కనబరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్లో సెంచరీ చేసిన అతను, మొత్తం సిరీస్ను 219 పరుగులు, 1 వికెట్తో ముగించాడు. “నేను మంచి ఫామ్లో ఉన్నాను, కానీ మా జట్టు విజయం సాధించలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీపై మా దృష్టి ఉంది,” అని అతను మ్యాచ్ తర్వాత చెప్పాడు. పిచ్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, “కరాచీ పిచ్లో 280-290 పరుగులు సరిపోతాయి, కానీ మేము 30 పరుగులు తక్కువ చేశాము. నా వికెట్, రిజ్వాన్ వికెట్ మా విజయావకాశాలను దెబ్బతీశాయి,” అని వివరించాడు.
పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన జట్టు ఓటమిపై మాట్లాడుతూ, “మేము రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కష్టం అవుతుందని భావించి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ న్యూజిలాండ్ బౌలర్లు మమ్మల్ని తీవ్రంగా పరీక్షించారు. మేము 280-290 లక్ష్యాన్ని సాధించాలని చూశాము, కానీ 15 పరుగులు తక్కువ చేశాము,” అని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్పై ఓటమి పాకిస్తాన్కు గట్టి దెబ్బే. పైగా, నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించడం మ్యాచ్కు మరింత ఆసక్తిని జోడించింది. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ జట్టు తన బలహీనతలను అర్థం చేసుకుని, మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19న జరిగే ప్రధాన మ్యాచ్లో పాకిస్తాన్ ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి.
We've got some feline company enjoying cricket on the ground 🐈⬛🤩#3Nations1Trophy | #PAKvNZ pic.twitter.com/Nx2RMmzA82
— Pakistan Cricket (@TheRealPCB) February 14, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..