Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England tour: పురుషుల టీమ్ కు ఒకలా.. మహిళల టీమ్ కు మరోలా.. ఇంగ్లాండ్ టూర్ కోసం కరోనా పరీక్షలు.. బీసీసీఐ వింత పోకడ!

England tour:  భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త వివాదానికి తెర తీసింది. టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు రెండూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది.

England tour: పురుషుల టీమ్ కు ఒకలా.. మహిళల టీమ్ కు మరోలా.. ఇంగ్లాండ్ టూర్ కోసం కరోనా పరీక్షలు.. బీసీసీఐ వింత పోకడ!
England Tour
Follow us
KVD Varma

|

Updated on: May 18, 2021 | 8:30 AM

England tour:  భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొత్త వివాదానికి తెర తీసింది. టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు రెండూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఇందుకోసం టూరుకు వెళ్ళాల్సిన జట్టు సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, పురుషుల జట్టుకు ఒక విధంగా.. స్త్రీల జట్టుకు ఒక విధంగా కరోనా పరీక్షలకు విధి విధానాలు ఇచ్చారు. పురుషుల జట్టులోని ఆటగాళ్లకు ఒక్కోరికీ మూడు సార్లు పరీక్షలు జరుపుతున్నారు. పైగా బోర్డు వారి చిరునామాలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు ఇదే టూరు వెళ్ళాల్సిన మహిళా జట్టుకు మాత్రం కరోనా పరీక్షలు చేయించుకుని ఆ నివేదిక తీసుకు వస్తే చాలని కోరింది. ఈ విషయంలో ఆటగాళ్ళు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

జూన్ నెలలో పురుషుల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. అక్కడ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అదేవిధంగా ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడవలసి ఉంది. ఇందుకోసం బోర్డు సన్నాహాల్లో బిజీగా ఉంది. దీని కోసం బోర్డు రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా మహిళా జట్టు కూడా 1 టెస్ట్, 3 వన్డేలు, 1 టి 20 మ్యాచ్ లలో ఆడటానికి జూన్ 16 నుండి జూలై 15 వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. దీని కోసం మే 19 నుండి ముంబయిలో పురుష, మహిళల జట్టులోని ఆటగాళ్లందరినీ క్వారంటైన్ చేయనున్నారు. ముంబయిలో ఆటగాళ్ళు 48 గంటల ముందుగానే పరీక్ష నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నెగెటివ్ ఉన్న తర్వాత మాత్రమే వారు హోటల్‌లోకి ప్రవేశించగలుగుతారు, అక్కడ వారు ఒక వారం క్వారంటైన్ లో ఉండవలసి ఉంటుంది. పురుషుల ఆటగాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆటగాళ్ల ఇంటి వద్ద కరోనా చెక్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానెతో సహా ఇతర ఆటగాళ్ళు షరతుపై ఒక వారం క్వారంటైన్ మాఫీ చేయాలని నిర్ణయించారు, అయితే వీరు ఇంటి వద్ద ఒంటరిగా ఉండవలసి ఉంటుంది.

ఇప్పటివరకు రెండు కరోనా టెస్టులు జరిగాయని పురుషుల జట్టులోని ఒక సభ్యుడు మీడియాకు చెప్పారు. మూడవ పరీక్ష రేపు జరుగుతుంది. రోజు గ్యాప్‌తో మూడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, క్రీడాకారుల బంధువుల కోసం ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు జరిగాయి. అయితే, మహిళా జట్టుకు ఇటువంటి నిబంధనలు లేవు. వారు తమకు కరోనా లేదని చెప్పే సర్టిఫికేట్ సమర్పిస్తే సరిపోతుంది. నేరుగా బాబుల్ లోకి ప్రవేశం ఇస్తారు. వీరు ఆసుపత్రి, కరోనా టెస్ట్ కేంద్రంలో తమను తాము పరీక్షించుకుంటారు. అటువంటి పరిస్థితిలో, సోకిన వ్యక్తితో సంబంధం ఏర్పడితే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లోని కొందరు పేర్కొంటున్నారు. వెళ్ళేది ఒకే దేశం.. దాదాపుగా ఒకే సమయం.. అయినా మహిళల జట్టు విషయంలో ఒకలాగా.. పురుషుల జట్టు విషయంలో ఒకలాగా నిబంధనలు ఉండడంపై పలువురు బీసీసీఐ వైఖరిని తప్పు పడుతున్నారు.

టెస్టులు, వన్డేలకు మహిళల క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధనా, పూనమ్ రౌత్, ప్రియా పునియా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగెజ్, షెఫాలి వర్మ, స్నేహ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ , జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్.

టీ 20 మహిళల క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందనా (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగెజ్, షెఫాలి వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్) పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్.

Also Read: Hardik Pandya: జూనియర్ పాండ్య వేస్తున్న బుడి బుడి అడుగులను ఎంజాయ్ చేస్తున్న హార్దిక్‌ పాండ్య.. ( వీడియో )

ఇండియా, శ్రీలంక సిరీస్‌కు ముందు షాకింగ్ న్యూస్..! వెటరన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ చేస్తామని బెదిరింపులు..?

ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??