IND vs AUS: రిటైర్మెంట్‌ జోన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీరే!! ఆసీస్‌ను ‘కంగారు’ పెట్టకపోతే జట్టులో చోటిక అనుమానమే

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇది నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, భారత్ గెలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

IND vs AUS: రిటైర్మెంట్‌ జోన్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీరే!! ఆసీస్‌ను 'కంగారు' పెట్టకపోతే జట్టులో చోటిక అనుమానమే
Team India
Follow us

|

Updated on: Feb 05, 2023 | 9:27 PM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇది నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, భారత్ గెలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, ఆసీస్‌కు పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. కాగా అనేక కారణాల వల్ల ఇరు జట్లకు ఈ టెస్టు సిరీస్ చాలా కీలకం. కొంతమంది ఆటగాళ్లకు ఇదే చివరి టెస్టు సిరీస్‌ కూడా. ప్రధానంగా ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉంది. వారెవరో చూద్దాం. అందులో ముందున్నది జయదేవ్ ఉనద్కత్.. ఈ టెస్టు సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న తొలి ఆటగాడు జయదేవ్ కావచ్చు. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 10 ఏళ్ల తర్వాత అవకాశం దక్కించుకున్న ఉనద్కత్ ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపిక కావడం అనుమానమే. కాబట్టి అతను భారత్-ఆసీస్ టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.

రవిచంద్రన్ అశ్విన్

టెస్టు క్రికెట్‌లో ఆర్. అశ్విన్ ఇప్పటికీ ప్రమాదకరమైన స్పిన్నర్ అనడంలో సందేహం లేదు. అవసరమైతే బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా అతనికి ఉంది. కానీ, అశ్విన్ వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అలాగే అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నారు. అయితే అశ్విన్ స్పిన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కుల్దీప్ యాదవ్ కూడా ఎదురుచూస్తున్నాడు. ఆ విధంగా ఈ టెస్టు సిరీస్ తర్వాత అశ్విన్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

ఉమేష్ యాదవ్

భారత్-ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగల మరో క్రికెటర్ ఉమేష్ యాదవ్. గతేడాది అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శన కనబరచడంతో మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. టీమ్ ఇండియాలో ఇప్పటికే మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్‌ పేసర్లు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఉమేష్ జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమే. ఈ సిరీస్‌లో రాణించకపోతే అతను మళ్లీ రెడ్‌బాల్‌ ఫార్మాట్లో ఆడడం అనుమానమే. ఈ సిరీస్‌ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో