AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కెమెరామెన్ సిరాజ్.. సూర్యతో ఢిష్యూం, ఢిష్యూం.. ఫొటోషూట్ చూస్తే నవ్వాగదు.. మిస్సయిన రన్ మెషీన్..

Team India Photoshoot: ఈ ఈవెంట్‌ను గెలవడానికి రోహిత్ శర్మ టీం బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. టోర్నీలో బలమైన జట్లలో భారత్ ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టు బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. అంతే కాకుండా స్వదేశంలో ఆడటం వల్ల భారత జట్టు పూర్తి ప్రయోజనం పొందుతుంది. మరి ఇప్పుడు అందరి అంచనాలను టీమిండియా నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.

Video: కెమెరామెన్ సిరాజ్.. సూర్యతో ఢిష్యూం, ఢిష్యూం.. ఫొటోషూట్ చూస్తే నవ్వాగదు.. మిస్సయిన రన్ మెషీన్..
Team India Photo Shoot
Venkata Chari
|

Updated on: Oct 03, 2023 | 4:28 PM

Share

ICC World Cup 2023: ఐసీసీ క్రికెట్ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతకు ముందు సోమవారం ఆటగాళ్లు ప్రపంచ కప్ కిట్‌ను ధరించి ఫోటోషూట్ నిర్వహించారు. ఈ సమయంలో, ప్రతి ఒక్కరూ తమ పలు యాంగిల్స్‌లో పోజులిస్తూ, సరదాగా ఫొటో షూట్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది.

భారత జట్టు తన చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను మంగళవారం నెదర్లాండ్స్‌తో (IND vs NED) ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ కూడా వర్షంతో రద్దయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దైంది. దీంతో 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌నకు వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే, విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్ల ఫొటోషూట్ జరిగింది. అక్టోబర్ 2 వరకు తిరువనంతపురంలో ఉన్న జట్టుతో కోహ్లి చేరలేదు. దీంతో ఆయన ఈ ఫొటో షూట్‌లో పాల్గొనలేదు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఆటగాళ్లను షూట్ లొకేషన్‌కు తీసుకొచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కెమెరా ముందు పోజులు ఇస్తూ తమ ఫొటోలను క్లిక్ మనిపించారు. ఈ సమయంలో మహ్మద్ సిరాజ్ తన ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సూర్యకుమార్ యాదవ్ ఫొటోలు తీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సీరియస్‌గా చర్చలు కూడా జరిగాయి. కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ సహా జట్టులోని ఇతర ఆటగాళ్లు చాలా మంచి మూడ్‌లో కనిపించారు.

ఈ వీడియోను ఇక్కడ చూడండి:

ప్రపంచ కప్ లీగ్ దశలో, భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే తన చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో నవంబర్ 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. లీగ్ దశలో ప్రదర్శనపైనే టీమిండియా తదుపరి ప్రయాణం ఆధారపడి ఉంటుంది.

ఈ ఈవెంట్‌ను గెలవడానికి రోహిత్ శర్మ టీం బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. టోర్నీలో బలమైన జట్లలో భారత్ ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జట్టు బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. అంతే కాకుండా స్వదేశంలో ఆడటం వల్ల భారత జట్టు పూర్తి ప్రయోజనం పొందుతుంది. మరి ఇప్పుడు అందరి అంచనాలను టీమిండియా నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.

వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత్ జట్టు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..