AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: భారత అథ్లెట్లకు గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..

Paris Olympics 2024: వచ్చే వారం నుంచి క్రీడల మహకుంభం ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ ఆటగాళ్ల కోసం బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.

Paris Olympics 2024: భారత అథ్లెట్లకు గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..
Jay Shah
Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 8:29 PM

Share

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 1900లో భారత్ తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొంది. ప్రస్తుతం భారత్ 26వ సారి ఒలింపిక్స్‌కు సిద్ధం కానుంది. మొత్తం 117 మంది భారత ఆటగాళ్లు భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతను స్వీకరించారు. ఈ భారీ కార్యక్రమానికి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే ఆటగాళ్లను ఆదుకునేందుకు భారత ఒలింపిక్‌ సంఘానికి బీసీసీఐ నగదు సహాయం చేసేందుకు సిద్ధమైంది.

ఒలింపిక్స్‌కు బీసీసీఐ భారీ ప్రకటన..

బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మన అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు ఇస్తుందని ప్రకటించడానికి గర్వపడుతున్నాను అంటూ జైషా ట్వీట్ చేశాడు. ప్రచారం కోసం భారత ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు అందిస్తున్నాం అంటూ ప్రకటించారు.

టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులను సత్కరించిన బీసీసీఐ..

గతంలో 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లను బీసీసీఐ సత్కరించింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, రజతం సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు, పీవీ సింధు, లోవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పునియాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు రివార్డుగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాటు కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు రూ.1.25 కోట్లు అందించారు.

ఇవి కూడా చదవండి

పతకాలపై ఆశలు పెట్టుకున్న భారత్..

ఈసారి భారత్‌కు చెందిన 111 మంది అథ్లెట్లు పతకం సాధించేందుకు కృషి చేయనున్నారు. ఒలింపిక్స్‌ చరిత్ర గురించి చెప్పాలంటే భారత్‌ పేరిట ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలు ఉన్నాయి. గత ఒలింపిక్స్ భారతదేశానికి అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. ఇక్కడ భారతదేశం మొత్తం 7 పతకాలు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత అభిమానులు ఈసారి తమ ఆటగాళ్ల నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో