AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. 20 మందితో జాబితా రెడీ.. రోహిత్, కోహ్లీ పరిస్థితి ఏంటంటే?

Team India: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటినుంచే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జట్టు ఎంపిక, ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఐపీఎల్ ప్రదర్శన ఇలా ప్రతి అంశాన్ని కచ్చితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు కూడా ఆసక్తికరంగా మారింది.

2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. 20 మందితో జాబితా రెడీ.. రోహిత్, కోహ్లీ పరిస్థితి ఏంటంటే?
Team India
Venkata Chari
|

Updated on: Mar 20, 2026 | 4:20 PM

Share

Team India: 2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఇంకా ఏడాదిపైగానే సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ముందుగానే జట్టు రూపకల్పనపై దృష్టి పెట్టింది. గత ఐసీసీ టోర్నీల్లో విజయాలు సాధించిన భారత జట్టు, ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసింది.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో కొత్త దిశ..

ఇటీవల భారత వన్డే, టెస్ట్ జట్లకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే అతని కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఎదురవడం బీసీసీఐ ఆలోచనలను ప్రభావితం చేసింది.

ఐపీఎల్ ప్రదర్శనపై ఎంపికలు..

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను జాగ్రత్తగా పరిశీలించనుంది. ప్రతి సెలెక్టర్ వారానికి కనీసం ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లేదా టీవీ ద్వారా వీక్షిస్తూ ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ను అంచనా వేయనున్నారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ కమిటీ వరల్డ్ కప్‌నకు సరైన జట్టును ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

20 మంది ప్రాబబుల్స్ జాబితా..

వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సుమారు 20 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇందులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు ప్రధానంగా ఉంటారు.

కొత్త ఆటగాళ్లను ఎక్కువగా ప్రయోగించకుండా, స్థిరమైన జట్టుతో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉంది.

టెస్ట్ క్రికెట్‌పై స్పష్టమైన దృక్పథం..

టెస్ట్ క్రికెట్‌లో ప్రయోగాలకు బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు ప్రధాన ఎంపికగా కొనసాగనున్నారు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో కూడా వీరే కీలకంగా ఉండనున్నారు.

రోహిత్-కోహ్లీ భవిష్యత్తు..

టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఇటీవలి సిరీస్‌ల్లో వీరి ప్రదర్శన స్థిరంగా ఉండటం గమనార్హం. అయితే ప్రతి మ్యాచ్ వీరి కెరీర్‌కు కీలకంగా మారుతోంది. వరల్డ్ కప్ జట్టులో వీరికి స్థానం దక్కుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

తదుపరి సిరీస్..

భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో ఆఫ్ఘానిస్థాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కూడా వరల్డ్ కప్ జట్టు ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

బీసీసీఐ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం భారత జట్టు సీరియస్‌నెస్‌ను చూపిస్తోంది. అనుభవం, యువత కలయికతో 2027 వరల్డ్ కప్‌కు బలమైన జట్టు సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us