AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్.. ఇకపై అలాంటి వాటికి నో ఛాన్స్.. భారీగానే ప్లాన్ చేసిందిగా

BCCI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ ధోరణి మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త రూల్స్‌తో ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనుంది. అసలు ఇలాంటి నిర్ణయం బీసీసీఐ ఎందుకు తీసుకుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Team India: టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్.. ఇకపై అలాంటి వాటికి నో ఛాన్స్.. భారీగానే ప్లాన్ చేసిందిగా
Bcci New Rule For Team India Players
Venkata Chari
|

Updated on: Jan 14, 2025 | 6:44 PM

Share

Team India: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఆటగాళ్ల కుటుంబాల కోసం బీసీసీఐ కొన్ని నిబంధనలను రూపొందించింది. దీంతో ఇకపై భారత జట్టు పర్యటనలో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు. తాజాగా వినిపిస్తోన్న నివేదికల మేరకు మొత్తం పర్యటనలో ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు వారితో ఉండరని బీసీసీఐ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. టూర్ 45 రోజులు ఉంటే, ఆటగాళ్ల కుటుంబం లేదా భార్య వారితో 14 రోజులు మాత్రమే ఉండగలరు. టూర్ తక్కువగా ఉంటే, కుటుంబం వారితో 7 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు. ఇదంతా ఎందుకు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుందనేది ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది. అంతెందుకు, ఆటగాళ్లకు సన్నిహితంగా ఉండే వారితో బీసీసీఐకి ఎలాంటి సమస్య ఎదురైంది? దీనికి అసలు కారణాన్ని ఓసారి చూద్దాం..

ఆటగాళ్ల కుటుంబాలతో బీసీసీఐకి ఈ సమస్య ఉందా?

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. అందువల్ల ఆటగాళ్ల కుటుంబాల కోసం ఖర్చు చేసే డబ్బు దీనికి సమస్య కాదు. కానీ, అతిపెద్ద సమస్య లాజిస్టిక్స్. అవును, మొత్తం పర్యటనలో ఆటగాళ్ల కుటుంబాలు వారితో ఉన్నప్పుడు, వారిని జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐ బాధ్యత. బీసీసీఐ ఆటగాళ్ళపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యత టీమిండియాకు సంబంధించిన మేనేజర్లపై ఉంటుంది.

ఇక్కడ అతి పెద్ద విషయం ఏంటంటే.. ఆటగాళ్లను చూసుకోవడం సులువే. కానీ, వారి కుటుంబాలను మేనేజ్ చేయడం కాస్త కష్టమే. దీనికి ఉదాహరణ 2020లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్ల కుటుంబాలను నిర్వహించడానికి బీసీసీఐ కష్టపడాల్సి వచ్చింది. ఆ టూర్‌లో టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సంఖ్య 40 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వారికి రెండు బస్సుల కంటే ఎక్కువగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆటగాళ్ల కుటుంబాలకు మ్యాచ్ టిక్కెట్లను ఏర్పాటు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్నది. 2019 ప్రపంచకప్ సమయంలో కూడా బీసీసీఐ అధికారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.

ఇవి కూడా కారణాలు కావొచ్చు..

ఆటగాళ్ల కుటుంబాలు సుదీర్ఘ పర్యటనలలో వారితో ఉంటే, మరికొన్ని విషయాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, పర్యటనలో భార్య, స్నేహితురాలు కలిసి ఉంటే, ఆటగాళ్ళు వారి ఖాళీ సమయంలో వారితో ఉండాల్సి ఉంటుంది. ఆటగాళ్లు వాకింగ్ కోసం బయటకు వెళ్తే, వారితో కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆటగాళ్ళు ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లడం, కలిసి ఆనందించడం ముఖ్యం. కానీ, కుటుంబం ఉంటే ఇలా కుదరదు. ఆటగాళ్లు తమ కుటుంబాలు కలిసి ఉంటే మరింత ధ‌ృడంగా ఉంటారని బీసీసీఐ భావిస్తోంది. అయితే, కుటుంబం పక్కన లేకుంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒకరి గదుల్లోకి ఒకరు వెళ్లవచ్చు. కుటుంబంతో ఉంటే ఇలా కుదరదు. ఆటగాడిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి ఈ నిర్ణయం సరైనదని నిరూపించవచ్చు. ప్రపంచంలోని చాలా పెద్ద జట్లు పెద్ద టోర్నమెంట్‌లు లేదా మ్యాచ్‌ల ముందు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీని చూసి బీసీసీఐ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కో సం ఇక్కడ క్లిక్ చేయండి..