AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫిట్‌నెస్‌లో ఫర్‌ఫెక్ట్.. వరుస సెంచరీలతో నెక్స్ట్ లెవల్ క్రికెట్.. ఆ ఒక్క కారణంతో వద్దంటారా: బీసీసీఐపై భారత మాజీ ప్లేయర్ ఫైర్..

రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తొలిరోజు 125 పరుగుల పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డాడు.

Video: ఫిట్‌నెస్‌లో ఫర్‌ఫెక్ట్.. వరుస సెంచరీలతో నెక్స్ట్ లెవల్ క్రికెట్.. ఆ ఒక్క కారణంతో వద్దంటారా: బీసీసీఐపై భారత మాజీ ప్లేయర్ ఫైర్..
Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Jan 18, 2023 | 3:24 PM

Share

సర్ఫరాజ్ ఖాన్‌పై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం బలమైన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నా.. టీమ్ ఇండియాలో చోటు సంపాదించలేకపోతున్నాడు. జనవరి 17న, రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన ముంబై మ్యాచ్‌లో మొదటి రోజు, సర్ఫరాజ్ 125 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

క్లిష్ట పరిస్థితుల్లో సర్ఫరాజ్‌ చేసిన ఈ ఇన్నింగ్స్‌ ముంబైకి చాలా కీలకంగా మారింది. సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌ ఆధారంగానే ముంబై జట్టు 293 పరుగుల స్కోరును అందుకోగలిగింది. ఇటీవల, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆల్ ఇండియా సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మొదటి రెండు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది. అయితే, సర్ఫరాజ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని భావించినా అది కుదరలేదు. సర్ఫరాజ్‌ను టీమిండియాలో ఎంపిక చేయకపోవడంపై వెంకటేష్ ప్రసాద్ ఘాటుగా స్పందించాడు.

ఇవి కూడా చదవండి

సర్ఫరాజ్ వైరల్ వీడియో..

సర్ఫరాజ్ సెంచరీ వీడియోను పంచుకుంటూ, వెంకటేష్ ప్రసాద్, ‘వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ దేశీయ సీజన్‌లు ఆడినా.. సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్ట్ జట్టులో లేకపోవడం అతనికి అన్యాయం మాత్రమే కాదు, ఇది దేశీయ క్రికెట్‌ను దుర్వినియోగం చేయడమే. ఈ ప్లాట్‌ఫారమ్‌కు అస్సలు అర్థం లేదని తెలుస్తోంది. పరుగులు చేయడానికి ఫిట్‌గా ఉన్నాడు. బరువు విషయానికొస్తే, ఈ బరువుతో చాలా మంది ఇతర ఆటగాళ్లు అంతర్జాతీయంగా ఆడుతూనే ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు.

ముంబై నుంచి సర్ఫరాజ్ ఖాన్ అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాడు. 155 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేశాడు. అతను తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 50 పరుగుల స్కోరును చేరుకోలేకపోవడం గమనార్హం. పృథ్వీ షా 40 పరుగులు చేసి రెండో అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..