AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతూ పూజలతో అమ్మవారు కరుణించారా..? టాలెంటే గెలిచిందా..?

మొక్కులు చెల్లిస్తే మ్యాచ్‌లు గెలవొచ్చా..? పూజలు చేస్తే ఫైనల్ రిజల్ట్ మారిపోతుందా..? గ్రహబలం తోడైతే టీం ఏదైనా గెలుపు ముంగిట నిలుస్తుందా..? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత ఇవే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయ్..! మ్యాచ్‌కు ముందే ఓ జోతిష్యుడు ముంబై గెలుస్తుందని చెప్పడం.. దీనికి తోడు అదే మ్యాచ్‌కు ముందు నీతూ అంబానీ పూజలు చేయడంతో.. ఇది నిజమే కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ […]

నీతూ పూజలతో అమ్మవారు కరుణించారా..? టాలెంటే గెలిచిందా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2019 | 5:46 PM

Share

మొక్కులు చెల్లిస్తే మ్యాచ్‌లు గెలవొచ్చా..? పూజలు చేస్తే ఫైనల్ రిజల్ట్ మారిపోతుందా..? గ్రహబలం తోడైతే టీం ఏదైనా గెలుపు ముంగిట నిలుస్తుందా..? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత ఇవే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయ్..! మ్యాచ్‌కు ముందే ఓ జోతిష్యుడు ముంబై గెలుస్తుందని చెప్పడం.. దీనికి తోడు అదే మ్యాచ్‌కు ముందు నీతూ అంబానీ పూజలు చేయడంతో.. ఇది నిజమే కావచ్చని కొందరు భావిస్తున్నారు.

ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ రెండూ బలమైన టీంలే..! కానీ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్లెవరైనా.. ఈసారి చెన్నైకు కప్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు. కానీ సెకండ్ హాఫ్‌లో రిజల్ట్ మారిపోయింది. అనూహ్యంగా ఐపీఎల్ కప్‌ను ముంబై ఎగరేసుకుపోయింది.

ఇక నీతూ అంబానీ పూజలు కూడా ముంబై ఇండియన్స్ విజయానికి కారణమన్న వాదన కూడా ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతూ అంబానీ పూజలు చేశారు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నంత సేపు ఆమె అమ్మవారిని స్మరిస్తూనే ఉన్నారు. కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడి పండితులు, జ్యోతిష్యులు కూడా ఈ వాదనను సమర్ధిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు గ్రహబలం కలిసొచ్చిందని అంటున్నారు. యురేనన్ గ్రహం ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చిందని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలను జన విజ్ఞాన వేదిక మాత్రం ఖండిస్తోంది. ఎవరైనా టాలెంట్‌తోనే మ్యాచ్ గెలుస్తారే తప్ప.. గ్రహబలంతో కాదని అంటున్నారు. పూజలూ, పునస్కారాల వల్ల గెలుపు సాధ్యమేనా.. అన్నదానిపై మేధావులు ఆలోచించాలని ఈ వేదిక కోరుతుంది.