AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SL: శ్రీలంకపై మూడు మార్పులు చేయాల్సిందే.. లేదంటే ఓటమి తప్పదంటోన్న మాజీలు..

భారత్ తమ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం శ్రీలంకపై తప్పక గెలవాల్సి ఉంది.

IND Vs SL: శ్రీలంకపై మూడు మార్పులు చేయాల్సిందే.. లేదంటే ఓటమి తప్పదంటోన్న మాజీలు..
Asia Cup 2022 Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Sep 06, 2022 | 7:40 AM

Share

ఆదివారం జరిగిన ఆసియా కప్-2022 లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. సూపర్-4 రౌండ్‌లోని ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ ఓటమి భారత్‌కు ఫైనల్‌కు వెళ్లడం కష్టతరం చేసింది. ఇప్పుడు భారత్‌కు, మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు దెబ్బతింటాయి.

పాకిస్థాన్‌పై చేసిన తప్పులను భారత్ సరిదిద్దుకుని, శ్రీలంకపై ఆ తప్పులను పునరావృతం చేయకుండా ఉంటేనే మంచిది. ఇందుకోసం టీమ్ ఇండియా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లంకను ఓడించగలదు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి వస్తున్న శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ముందుగా బంగ్లాదేశ్‌ను ఓడించి సూపర్-4లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. కాబట్టి భారత్‌పై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటుంది.

టీమ్ ఇండియా మూడు భారీ మార్పులు చేయాల్సి ఉంది..

ఇవి కూడా చదవండి

నిరంతరం అటాకింగ్ క్రికెట్ ఆడతామని భారత జట్టు కోచ్, కెప్టెన్ చాలాసార్లు చెప్పారు. పాకిస్థాన్‌పై ఈ వ్యూహం భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న టీమ్ ఇండియా స్కోరును అందుకోలేకపోయింది. భారత్ ఈ వ్యూహాన్ని మార్చుకోవాలి. పరిస్థితిని బట్టి టీమిండియా ఆడాల్సి ఉంటుంది. భారత్ జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌పై ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను ఆడిన జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉన్నాడు. శ్రీలంకపై భారత్ ముగ్గురు సరైన ఫాస్ట్ బౌలర్లతో వెళ్లాలి. పాండ్యా ఉంటే భారత్‌కు నాలుగు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్‌లు ఉంటాయి.

ప్లేయింగ్-11లో భారత్ ఇద్దరు ఆల్ రౌండర్లను చేర్చుకోవాలి. పాండ్యా కాకుండా, స్పిన్ ఎంపికను అందించి, బ్యాట్‌తో కూడా అద్భుతమైన ఆటను ప్రదర్శించగల అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. పాకిస్థాన్‌పై దీపక్ హుడాకు భారత్ అవకాశం ఇచ్చింది. హుడాకు బ్యాట్‌తో అద్భుతాలు చేయడం తెలుసు. బంతితో కూడా సహకారం అందించగలడు. కానీ, రోహిత్ అతన్ని బౌలింగ్ చేయించలేకపోయాడు.