AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డివిలియర్స్ మెరుపులు వృధా.. బెంగళూరు పై ముంబై విజయం

బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), హార్దిక్ పాండ్య(32; 14 బంతుల్లో) రాణించారు. కాగా చాహల్ 4 వికెట్లు […]

డివిలియర్స్ మెరుపులు వృధా.. బెంగళూరు పై ముంబై విజయం
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 1:43 PM

Share

బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), హార్దిక్ పాండ్య(32; 14 బంతుల్లో) రాణించారు. కాగా చాహల్ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, ఉమేష్ లు చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(31; 22 బంతుల్లో) మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక కొద్దిసేపటికే ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(48; 32 బంతుల్లో), ఏబీ డివిలియర్స్(70 నాటౌట్; 41 బంతుల్లో) వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డు ముందుకు కదిలించారు. అయితే కోహ్లీని బుమ్రా ఔట్ చేయడంతో బెంగుళూరుకు గట్టి దెబ్బ తగిలింది. విరాట్ ఔటైనా.. ఏబీ మాత్రం తనదైన శైలిలో షాట్స్ కొడుతూ ముంబై బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. అయితే చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు పరుగులు ఇవ్వకుండా ఆర్సీబీ ని కట్టడి చేయడంతో పరాభవం తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/20), మార్కండే (1/23) చక్కని బౌలింగ్ చేశారు. ఇక ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.