AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brihaspati Temple: మేధస్సును పెంచే.. దేవగురు బృహస్పతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Brihaspati Dham Nainital: ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా సమీపంలో దేవతల గురువు అయిన బృహస్పతి దేవుడికి అంకితం చేయబడిన దేవాలయం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 8000 అడుగుల ఎత్తులో ఉన్న దేవగురు పర్వతం దాని సహజ సౌందర్యానికి మాత్రేమా కాకుండా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత, దాని వెనుక ఉన్న పౌరాణిక కథకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Brihaspati Temple: మేధస్సును పెంచే.. దేవగురు బృహస్పతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Brihaspati Temple
Rajashekher G
|

Updated on: Jan 29, 2026 | 1:01 PM

Share

భారతదేశంలో దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేక అద్భుత ఆలయాలకు నెలవు. ఈ హిమాలయ రాష్ట్రంలో ఎక్కువగా శివుడికి సంబంధించిన ఆలయాలే ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక ఆలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తుంటాయి. వాటిలో ఒకటి నైనిటాల్ జిల్లా సమీపంలో దేవతల గురువు అయిన బృహస్పతి దేవుడికి అంకితం చేయబడిన దేవాలయం. సముద్ర మట్టానికి సుమారు 8000 అడుగుల ఎత్తులో ఉన్న దేవగురు పర్వతం దాని సహజ సౌందర్యానికి మాత్రేమా కాకుండా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత, దాని వెనుక ఉన్న పౌరాణిక కథకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బృహస్పతి ఆలయం ఎక్కడ ఉంది?

బృహస్పతి యొక్క ఈ పురాతన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని ఓఖల్కండ బ్లాక్‌లోని దేవ్‌గురు పర్వతంపై ఉంది. ఉత్తరాఖండ్‌లోని గురు బృహస్పతిని ప్రత్యేకంగా పూజించే కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన పర్వత శిఖరాలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ప్రదేశం శాంతి, సానుకూల శక్తికి కేంద్రంగా ఉంది.

పురాణాలు ఏం చెబుతున్నాయి..?

పురాణాల ప్రకారం.. దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు లేదా దేవతలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు.. దేవతల గురువు బృహస్పతి ఈ పర్వతంపై కూర్చుని ధ్యానం చేసేవాడు. ఈ ప్రదేశంలోనే గురువు కఠినమైన తపస్సు చేశాడని.. అతని ప్రయత్నాలకు సంతోషించిన శివుడు.. అతనికి దేవతల గురువు అనే బిరుదును, తొమ్మిది గ్రహాలలో ఒక స్థానాన్ని ప్రసాదించాడని చెబుతారు. పురాతన కాలంలో, చాలా మంది గొప్ప ఋషులు కూడా ఇక్కడ ధ్యానం చేశారని స్థానికులు చెబుతారు. నేటికీ, భక్తులు తమ జాతకాలలో గురు దోష నివారణ కోసం, జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడికి వస్తారు.

ఆలయానికి సంబంధించిన విశ్వాసాలు

జ్ఞానం, జ్ఞాన కేంద్రం.. విద్యార్థులు, విద్యలో నిమగ్నమైన వారు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి తమ మొక్కులను సమర్పిస్తారు. ఈ ఆలయం సందర్శించడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని భక్తుల నమ్మకం. కాగా, ప్రతి గురువారం ఇక్కడికి పెద్ద సంఖ్యలు భక్తులు తరలి వస్తారు. ప్రధాన నైవేద్యాలైన పసుపు రంగు దుస్తులు, పసుపు పూలు, పప్పుధాన్యాలు బృహస్పతికి సమర్పిస్తారు.

దేవగురు బృహస్పతి పర్వతాన్ని ఎలా చేరుకోవాలి?

ఈ దివ్య ప్రదేశాన్ని సందర్శించడానికి.. మీరు ముందుగా హల్ద్వానీ లేదా కత్గోడం చేరుకోవాలి. అక్కడి నుంచి భీమ్తాల్ ద్వారా ఓఖల్కండకు బస్సు లేదా టాక్సీలో వెళ్ళవచ్చు. ప్రధాన రహదారి నుంచి ఆలయానికి చేరుకోవడానికి కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ యాత్రను మరింత చిరస్మరణీయంగా చేస్తుంది. దైవారాధనతోపాటు ఇక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి.