AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala :తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన టికెట్లు..! కోటా విడుదల

ఇంకా, ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. భ‌క్తులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

Tirumala :తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శన టికెట్లు..! కోటా విడుదల
TTD
Jyothi Gadda
|

Updated on: May 24, 2022 | 4:43 PM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మే 26న టీటీడీ ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనున్నటు టీటీడీ తెలిపింది. మే 26వ‌ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుద‌ల చేయనుంది టీటీడీ. జూన్‌ 1నుండి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు ఉండనున్నట్టు టీటీడీ తెలిపింది. జూన్ 1వ తేదీ నుండి ఉద‌యం 10 గంట‌లకు బ‌దులుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో వయో వృద్ధులు, దివ్యాంగులను అనుమ‌తిస్తారు. భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ కోరింది. కాగా, ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. భ‌క్తులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

మరోవైపు తిరుమలలో గత వారం పది రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మే 23న స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.