Anantapuram: 5శతాబ్దాల చరిత్ర.. హనుమాన్ క్షేత్ర దర్శనం.. భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడల నుంచి విముక్తి

Anantapuram: ఆ క్షేత్రం ఒక మహిమాన్వితం.. అక్కడ క్షేత్రం పేరుతో చెబితే మూడు రాష్ట్రాల్లో భక్తులు.. మనసులో స్వామి వారిని స్మరించుకుంటారు. మనసులో ఏ కోరిక అనుకున్నా.. బజేహం అని స్మరించుకున్నా.. ఆంజనేయుడు..

Anantapuram: 5శతాబ్దాల చరిత్ర.. హనుమాన్ క్షేత్ర దర్శనం.. భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడల నుంచి విముక్తి
Sri Nettikanti Anjaneya Swa
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2022 | 1:27 PM

Anantapuram: ఆ క్షేత్రం ఒక మహిమాన్వితం.. అక్కడ క్షేత్రం పేరుతో చెబితే మూడు రాష్ట్రాల్లో భక్తులు.. మనసులో స్వామి వారిని స్మరించుకుంటారు. మనసులో ఏ కోరిక అనుకున్నా.. బజేహం అని స్మరించుకున్నా.. ఆంజనేయుడు (Anjaneyaswami) కనిపిస్తాడని నమ్మకం. నేరుగా భక్తులను చూస్తూ.. దర్శనమిస్తూ కనిపించే ఆ ఆంజనేయుని క్షేత్రానికి వెళ్తే.. సర్వం శుభం కలగడమే కాదు.. భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడ వదులుతుందని నమ్మకం. 5శతాబ్ధాల నుంచి భక్తుల నుంచి పూజలందుకుంటున్న ఆ ఆంజనేయుని క్షేత్రం(Hanuman Kshetram) ఎక్కడ ఉంది.. అక్కడి విశిష్టతలు ఏంటి..  తెలుసుకుందాం

నమో ఆంజనేయం నమో దివ్య కాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిలారక్షాకరం రుద్రా రూపం నమో మారుతిమ్ రామ దూతం నమామి

ఈ స్త్రోత్రం అను నిత్యం ప్రతిధ్వనించే క్షేత్రం ఇది… ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ, రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం.. శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకీ పెద్దది. ఇంతకీ ఎక్కడ ఉంది ఈ క్షేత్రం… అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయస్వామిగా కొలువుదీరాడు.. ఇంతకీ నెట్టికంటి అంటే… నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు. అలాగే కసాపురం అనే గ్రామంలో క్షేత్రం ఉండటం వలన కసాపురం ఆంజనేయస్వామిగా పిలుస్తుంటారు. మరోవైపు ఇంకో చరిత్ర కూడా ఉంది. పూర్వం ఇక్కడ నెట్టికళ్లు అనే గ్రామం ఉండటం వలన అది కాల క్రమంలో నెట్టికంటి ఆంజనేయస్వామిగా పిలుస్తుంటారని మరికొందరు చెబుతారు.

అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందంటే.. దానికి ఒక చరిత్ర ఉంది.. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తుశకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు. ప్రతి రోజూ తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి పై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరోచోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారుచేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయుల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో కనిపిస్తాడు. నీవు దక్షిణ దిశగా వెళ్లు… అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురుస్తుంది. అక్కడే నేను ఉంటాను. నాకు ఆలయాన్ని కట్టించు అని చెబుతాడు. ఆంజనేయస్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయులు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేపచెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురుస్తుంది. ఆ చెట్టు కింద తవ్వగా అంజేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ప్రస్తుత నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయంగా విరాజిల్లుతోందని.. చరిత్ర చెబుతోంది.

ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం. అంతే కాదు నేటికీ ఇక్కడ స్వామి వారి పాదుకలుగా చెప్పుకునే పాదరక్షలకు పూజలందుకోవడం చూడవచ్చు. ఈ పాదరక్షలు భుజంపై తాకిస్తే.. సకల దోషాలు తొలుగుతాయనిు భక్తుల నమ్మకం ఇలా ఎన్నో విశిష్టతలు, మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామి వారు నిత్య పూజలందుకుంటారు. ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. అంతే కాదు ఇక్కడ లోక కల్యాణం కోసం మన్యశిప్త హోమం నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టత. అందుకే కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలో పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు వస్తుంటారు. ఎన్నో వేల కుటుంబాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని ఇంటి దైవంగా కొలుస్తుంటారు.

ఇక్కడ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. భూత, ప్రేత, గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తుంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు.. స్వామి స్మరిస్తే.. అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి వారు నిత్యం ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంటారు. ఇక ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి వారి దర్శనం కోసం నిత్యం వస్తుంటారు. వీఐపీ ఎవరికీ తెలియకుండా ఏకాంత సేవల్లో తెల్లవారు జాము సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. దివంగత నేత ఎన్టీఆర్ తో ఎంతో మంది ప్రముఖులు స్వామిని విశేషంగా నమ్ముతారు. ఇంతకీ ఈ క్షేత్రానికి వెళాలంటే.. కసాపురం దగ్గర్లో 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్లారీ విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలోనో ప్రముఖంగా ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. గుంతకల్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, అటోల ద్వారా కసాపురం చేరుకోవచ్చు. ఇక బస చేసేందుకు దేవస్థానం వారి కాటేజ్ లు, రూమ్ లతో ప్రైవేటు లాడ్జిలు ఉంటాయి. అలాగే శ్రీ కృష్ణదేవరాయుల గురువైన వ్యాసరాయులు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. శ్రావణ మాసం శనివారం ఈ మూడు ఊళ్లను సందర్శిచడం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది.

ఇలా ఎన్నో విశిష్టతలకు, మహిమలకు నెలవైన శ్రీకసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో స్వామి వారి పూజ అత్యంత విశిష్టం.. మరి కసాపురం నెట్టికంటి ఆంజనేయున్ని మీరు కూడా దర్శించుకుని హనుమంతుడి అనుగ్రహం పొందండి.

Tv9 telugu : Reporter Kanth , Anantapur 

Also Read:

ఈ నలుగురితో నిజాయతీగా స్నేహం చేస్తే.. జీవితాంతం అన్నివిధాలా మీకు తోడుగా ఉంటారంటున్న చాణక్య

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు