AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rudrashtakam: రావణుడిపై విజయం కోసం రాముడు పఠించిన రుద్రాష్టకం.. ప్రాముఖ్యత, ప్రయోజనాలు మీ కోసం

గో స్వామి శ్రీ తులసీదాస్ రచించిన రుద్రాష్టకం పఠించడం శివ మంత్రాల్లో  చాలా పవిత్రమైనది.. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీరాముడు లంకను జయించే ముందు, శ్రీరాముడు శివుని పూజిస్తూ ఈ మంత్రాలతో మహాదేవుడిని స్తుతించాడని నమ్ముతారు. శివసాధనలో రుద్రాష్టకం పఠించడం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Rudrashtakam: రావణుడిపై విజయం కోసం రాముడు పఠించిన రుద్రాష్టకం.. ప్రాముఖ్యత, ప్రయోజనాలు మీ కోసం
Shiva Rudrashtakam
Surya Kala
|

Updated on: Jul 08, 2023 | 9:01 AM

Share

సనాతన సంప్రదాయంలో దేవత ఆరాధనలో మంత్ర జపం అత్యంత ప్రభావవంతమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శ్రావణ మాసంలో శివ భక్తులు శివుడి ఆరాధనలో భక్తి, విశ్వాసంతో వివిధ రకాల మంత్రాలు, స్తోత్రాలను పఠిస్తారు. గో స్వామి శ్రీ తులసీదాస్ రచించిన రుద్రాష్టకం పఠించడం శివ మంత్రాల్లో  చాలా పవిత్రమైనది.. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీరాముడు లంకను జయించే ముందు, శ్రీరాముడు శివుని పూజిస్తూ ఈ మంత్రాలతో మహాదేవుడిని స్తుతించాడని నమ్ముతారు. శివసాధనలో రుద్రాష్టకం పఠించడం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

రుద్రాష్టకం ఎప్పుడు, ఎలా చదవాలంటే  హిందూ విశ్వాసం ప్రకారం శివుడిని ఎప్పుడైనా  పూజించవచ్చు ఏ సమయంలోనైనా శివ స్తోత్రాన్ని పఠించవచ్చు. అయితే శివుడు పూజ ఫలం త్వరగా లభించాలంటే శివయ్యకు ఇష్టమైన నెల, ఇష్టమైన తేదీ , ఇష్టమైన సమయంలో చేయాలి. రుద్రాష్టకం పారాయణం చేసిన సత్ఫలితాలు కలగాలంటే సాయంత్రం పూట ఈశాన్య మూలలో కూర్చుని నియమానుసారంగా శివునికి అభిషేకం చేయండి.

నిబంధనల ప్రకారం ఎరుపు రంగు ఉన్ని ఆసనం లేదా కుశ ఆసనంపై కూర్చుని శివుని పూజ చేయండి. శ్రావణ మాసంలో 7 రోజుల పాటు రుద్రాష్టకం పారాయణం చేయడం ద్వారా సాధకుని కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

రుద్రాష్టకం చదవడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాలు సనాతన సంప్రదాయంలో శివుడిని స్తుతించే రుద్రాష్టకం పఠిస్తే, శివ భక్తుల కోరికలు త్వరలో నెరవేరుతాయి.

హిందూ విశ్వాసం ప్రకారం, శివపూజ సమయంలో రుద్రాష్టకం పఠించడం ద్వారా, జీవితానికి సంబంధించిన శారీరక, మానసిక సమస్యల నుండి చాలా త్వరగా బయటపడవచ్చు.

మీరు ఏదో ఒక విషయంలో చాలా కాలంగా కోర్టు-కోర్టు చుట్టూ తిరుగుతుంటే, ఆ కేసులో త్వరగా విజయం సాధించాలని కోరుకుంటూ శ్రావణ మాసంలో ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించాలి.

మీకు తెలిసిన లేదా తెలియని శత్రువుల భయం ఎల్లప్పుడూ ఉంటే, మీరు దానిని జయించటానికి లేదా దానిని వదిలించుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం రుద్రాష్టకం పఠించాలి.

హిందువుల విశ్వాసం ప్రకారం, శ్రీ తులసీదాస్  రచించిన రుద్రాష్టకం పఠించే సాధకుడిపై దేవ దేవుడు  మహాదేవుడు భోళాశంకరుడు ఆశీర్వాదం కలుగుతుంది. అతని కష్టాలన్నీ రెప్పపాటులో తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).