AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala Padipuja: శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం ఇదే!

Sabarimala Padipuja News Telugu: శబరిమలలో పడి పూజల నిర్వహణపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించనున్నట్లు కేరళ హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం 2040 వరకు 705 మంది పడి పూజను బుక్ చేసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Sabarimala Padipuja: శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం ఇదే!
Sabarimala Padipuja News
Rajashekher G
|

Updated on: Sep 10, 2026 | 12:06 PM

Share

Sabarimala Padipuja Telugu: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజ బుకింగ్‌లపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ఇకపై రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్‌లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. పడి పూజ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటలైజ్ చేయనున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. జాబితాలో ఉన్న వారిలో మరణించిన వ్యక్తుల పేర్లను గుర్తించి తొలగిస్తామని పేర్కొంది. ఈ అంశంపై జస్టిస్ బి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన దేవస్వం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం 2040 సంవత్సరం వరకు పడి పూజ కోసం మొత్తం 705 మంది బుక్ చేసుకున్నట్లు సమాచారం. పడి పూజ రుసుము రూ.1,37,900గా ఉంది. అయితే మండల-మకరవిళక్కు సీజన్‌లో పడి పూజలను నిర్వహించరు.

ఇదిలా ఉండగా, కొప్రక్కలం సమీపంలోని చిన్న దుకాణాన్ని వెంటనే తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అలాగే చాలకాయం-పంబ రహదారి పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు దేవస్వం బోర్డు కోర్టుకు వెల్లడించింది.

పూర్తయిన అన్నదాన మండపం..

ఇవి కూడా చదవండి

శబరిమలలో అన్నదాన మండపం నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిని ఇంకా ఎందుకు ప్రారంభించలేదో వివరణ ఇవ్వాలని దేవస్వం బోర్డును హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు, శబరిమలలో ప్రసిద్ధమైన అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 2 లక్షల నుంచి 2.25 లక్షల వరకు అరవణ కంటైనర్లు తయారవుతున్నాయి. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే చర్యల్లో భాగంగా కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

కొత్తగా ఆరు అరవణ తయారీ యూనిట్లు (వార్ప్‌లు), రెండు కూలింగ్ ఛాంబర్లు, ఒక బాయిలర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్లాంట్‌లో 26 అరవణ తయారీ యూనిట్లు, ఆరు కూలింగ్ ఛాంబర్లు, ఆరు బాయిలర్లు పనిచేస్తున్నాయి.

కొత్త ఏర్పాట్లు పూర్తయితే రోజువారీ అరవణ తయారీ సామర్థ్యం మరింత పెరగనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్‌లో అరవణ ప్రసాదానికి డిమాండ్‌ను తీర్చడమే ఈ విస్తరణ పనుల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.

Follow Us
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్
147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు నెలకొల్పిన పాక్
తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
తాతయ్యే వయసులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్