Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇక ముందు తిరుమలలో గదులు, లడ్డూలు ఇలాగే ఇస్తారు..

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సిఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇక ముందు తిరుమలలో గదులు, లడ్డూలు ఇలాగే ఇస్తారు..
Tirumala Accommodation
Follow us
Surya Kala

|

Updated on: Mar 15, 2023 | 11:13 AM

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. దర్శనం కోసం వెళ్లే భక్తులు బస చేయడానికి గదులను అద్దెకు తీసుకుంటారు. అయితే తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో గదులను కేటాయిస్తున్నారు. దీంతో గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో కేవలం ఐదు నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని తెలిపారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందన్నారు తెలిపారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో.. వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు.

ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపుతో అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సిఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదని చెప్పారు. ఈ విధంగా తిరుమలలో గదుల కేటాయింపు, లడ్డు కేటాయింపుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ గురించి.. భక్తులు పొందుతున్న సౌకర్యాల గురించి వివరించారు. అయితే టీటీడీ నిర్ణయంతో భక్తులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..