Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbha Mela: కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు.. సౌకర్యాలు ఏమిటంటే..

మహా కుంభ మేళాకు వచ్చే ప్రముఖులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు జాతర ప్రాంతంలో ఐదు చోట్ల 250 టెంట్ల సామర్థ్యంతో సర్క్యూట్ హౌస్ లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే విశిష్ట, అతి విశిష్ట ప్రముఖుల సౌకర్యార్థం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 110 కాటేజీలతో కూడిన టెంట్ సిటీ ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతోంది. 2200 కాటేజీలతో టెంట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు అధికారులు.

Maha Kumbha Mela: కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు.. సౌకర్యాలు ఏమిటంటే..
Maha Kumbha Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2024 | 10:29 AM

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న మహా కుంభ మేళా 2025 సందర్భంగా భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అలాగే భారీ సంఖ్యలో సెలబ్రేటీలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ ఫెయిర్‌ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మహా కుంభమేళాలో పాల్గొనే ప్రముఖులందరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి, వారి బస, ఇతర ప్రోటోకాల్‌లకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడానికి సన్నాహాలు చేయబడ్డాయి. మహాకుంభమేళా 2025 మొదటి ప్రధాన స్నానోత్సవం (పుష్య మాసం పౌర్ణమి) నుండి అంటే 13 జనవరి 2025న ప్రారంభమవుతుంది. చివరి ప్రధాన స్నానోత్సవం (మహాశివరాత్రి) 26 ఫిబ్రవరి 2025న జరగనుంది. ఈ మహా కుంభ మేళాను మొత్తం 45 రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఫెయిర్ అథారిటీకి సంబంధించిన అధికారుల ప్రకారం మహా కుంభమేళా జరిగే సమయంలో యాత్రికులు, పర్యాటకులు, భారతదేశం, విదేశాల నుంచి ప్రముఖులు, VIP ప్రముఖులతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వస్తారు. జాతర ప్రాంతంలో విశిష్ట/అతి విశిష్ట వ్యక్తుల రాక సమయంలో సౌలభ్యం కోసం, 24×7 కంట్రోల్ రూం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అధికారులు, ఉద్యోగులు మొహరించనున్నారు.

జాతరకు వచ్చే ప్రముఖుల ప్రోటోకాల్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ స్థాయిలో ముగ్గురు అదనపు జిల్లా మెజిస్ట్రేట్లు, ముగ్గురు డిప్యూటీ జిల్లా మెజిస్ట్రేట్లు, ముగ్గురు నాయబ్ తహసీల్దార్లు, నలుగురు అకౌంటెంట్లను నియమించారు. దీనితో పాటు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను మొత్తం 25 సెక్టార్‌లలో సెక్టార్ మేజిస్ట్రేట్‌లుగా నియమించారు. వారు వారి సంబంధిత రంగాలలో ప్రోటోకాల్ ఏర్పాట్లను నిర్ధారిస్తారు.

ఇవి కూడా చదవండి

5 సైట్లలో 250 టెంట్ల సామర్థ్యంతో సర్క్యూట్ హౌస్ ఏర్పాటు

ప్రత్యేక ప్రముఖులకు ప్రోటోకాల్ ప్రకారం మహా కుంభ మేళా -2025 సందర్భంగా 50 మంది టూరిస్ట్ గైడ్‌లను , ఇతర సహాయక సిబ్బందిని నియమించడం కూడా జరుగుతుంది. జాతరకు వచ్చే ప్రముఖులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు జాతర ప్రాంతంలో ఐదు చోట్ల 250 టెంట్ల సామర్థ్యంతో సర్క్యూట్ హౌస్ లను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే విశిష్ట, అతి విశిష్ట ప్రముఖుల సౌకర్యార్థం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 110 కాటేజీలతో కూడిన టెంట్ సిటీ, ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. 2200 కాటేజీలతో టెంట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. దీని బుకింగ్ ప్రయాగ్‌రాజ్ ఫెయిర్ అథారిటీ ద్వారా చేయబడుతుంది. దీనిని వెబ్‌సైట్ ద్వారా నావిగేట్ చేయవచ్చు. నదిలో స్నానానికి ఘాట్ సిద్ధం చేయడమే కాదు.. జెట్టీ, మోటారు బోటు సౌకర్యం కల్పించనున్నారు.

డిపార్ట్‌మెంటల్ క్యాంపులో అధికారులు

జాతర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మొత్తం 15 శాఖలు తమ సొంత శిబిరాలను నిర్మించుకున్నాయి, వీటిలో శాఖల అధికారులు రాక బస చేసేందుకు కాటేజీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మొత్తం 21 శాఖలు జాతర ప్రాంతంలో తమ సొంత శిబిరాలను ఏర్పాటు చేశాయి, అందులో డిపార్ట్‌మెంటల్ అధికారులు వచ్చే సమయంలో బస చేసేందుకు కాటేజీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు జిల్లా పరిపాలన అధికారులు ప్రయాగ్‌రాజ్‌లో అందుబాటులో ఉన్న 21 అతిథి గృహాలలో వీఐపీలు వసతి కోసం మొత్తం 314 గదులను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..