AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya pradesh: పశుపతినాథుని హుండీకి భారీగా చేరిన విరాళాలు.. రెండు రోజులుగా లెక్కించిన సిబ్బందికి కళ్లు బైర్లు..!

ఇటీవలే పశుపతినాథుని హుండీ లెక్కించారు ఆలయ నిర్వాహకులు. కాగా అందులో లక్షల రూపాయలతో పాటు విదేశీ కరెన్సీలు కూడా కనిపించాయి. భక్తుల విరాళాలు మొత్తం లెక్కించడానికి ఆలయ సిబ్బందికి రెండు రోజుల సమయం పట్టింది. హుండీల్లోని డొనేషన్ మొత్తాన్ని లెక్కించే పని రెండు రోజులుగా కొనసాగగా మొదటి రోజు

Madhya pradesh: పశుపతినాథుని హుండీకి భారీగా చేరిన విరాళాలు.. రెండు రోజులుగా లెక్కించిన సిబ్బందికి కళ్లు బైర్లు..!
Pashupatinaths
Jyothi Gadda
|

Updated on: Sep 10, 2023 | 2:31 PM

Share

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎనిమిది ముఖాల పశుపతినాథ్ విగ్రహం మందసౌర్‌లో ఉంది. ఇక్కడి పశుపతినాథుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు మందసౌర్ చేరుకుంటారు. యేటా శ్రావణ మాసంలో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈసారి కూడా పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో అలాంటి దృశ్యమే కనిపించింది. పశుపతినాథుని దర్శనం కోసం భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఆలయ హుండీ విరాళాలు భారీగానే సమకూరినట్టుగా తెలిసింది. భారతీయ కరెన్సీతో పాటుగా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా దొరికింది.

ఆలయానికి వచ్చే సందర్శకుల విరాళాలు కూడా భారీగా వచ్చి చేరాయి. ఇటీవలే పశుపతినాథుని హుండీ లెక్కించారు ఆలయ నిర్వాహకులు. కాగా అందులో లక్షల రూపాయలతో పాటు విదేశీ కరెన్సీలు కూడా కనిపించాయి. భక్తుల విరాళాలు మొత్తం లెక్కించడానికి ఆలయ సిబ్బందికి రెండు రోజుల సమయం పట్టింది. హుండీల్లోని డొనేషన్ మొత్తాన్ని లెక్కించే పని రెండు రోజులుగా కొనసాగగా మొదటి రోజు రూ.7 లక్షల 99 వేల 50, రెండో రోజు రూ.15 లక్షల 77 వేల 400 వసూలయ్యాయి. ఇలా రెండు రోజుల్లో విరాళం పెట్టె నుంచి మొత్తం రూ.23 లక్షల 76 వేల 400 వసూలు చేసి మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేశారు.

హుండీల్లో సమకూరిన విదేశీ కరెన్సీ:

ఇవి కూడా చదవండి

రూ. 1,000 ఫ్రెంచ్ నోటు, రూ. 20 చైనీస్ నోటు విదేశీ కరెన్సీలలో లభించింది. పశుపతినాథుని దర్శనం సందర్భంగా ప్రజలు తమ భక్తి, మద్దతుతో పాటు విదేశీ కరెన్సీలను అందించడానికి వస్తున్నారని తెలుస్తుంది. అంతేపెద్ద మొత్తంలో ఆభరణాలు కూడా దొరికాయి. ఆలయానికి చేరుకున్న భక్తులు బాబా భోలేకు డబ్బుతో పాటు ఆభరణాలను కూడా సమర్పించారు. అందులో 120 గ్రాముల బరువున్న కొన్ని వెండి వస్తువులు కూడా విరాళం పెట్టెలో కనిపించాయి. ఆలయానికి వచ్చే విరాళాల మొత్తం సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది.

మహాకాల్ లోక్ తరహాలో పశుపతినాథ్ లోక్ ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే ప్రకటన చేయగా, ఇందుకోసం రూ.10 కోట్లు కూడా మంజూరు చేశారు. పశుపతినాథ్ లోక్ నిర్మాణం తర్వాత, ఇక్కడ ఉన్న అష్టముఖ స్వామి పశుపతినాథ్ ఆలయానికి తరలిస్తారు. ఇది భక్తుల రద్దీని పెంచుతుంది. మందసౌర్ నగరంలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..