Bhadradri Rama : భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం, భక్తి ప్రపత్తులతో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు

Bhadradri Rama : ఖమ్మం జిల్లా భ‌ద్రాచ‌లంలో శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వ వేడుక‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు.

Bhadradri Rama : భద్రాద్రి రాముడికి వైభవంగా మహాపట్టాభిషేకం, భక్తి ప్రపత్తులతో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు
Bhadradri Rama
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 22, 2021 | 3:24 PM

Bhadradri Rama : ఖమ్మం జిల్లా భ‌ద్రాచ‌లంలో శ్రీ సీతారాముల క‌ళ్యాణోత్స‌వ వేడుక‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భద్రాద్రి శ్రీరాముడికి మహాపట్టాభిషేకం వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. స్థానిక నిత్యకల్యాణ మండపం దగ్గర వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ మహాపట్టాభిషేక క్రతువు నిర్వహించారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రాములోరికి అలంకరణ చేశారు. కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే, స్వామివారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 27 వరకు నిత్యకళ్యాణాలు నిలిపేశారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలను కూడా ఆపేశారు. ఇలాఉండగా, నిన్న శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల క‌ళ్యాణం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. స‌రిగ్గా మధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు అభిజిత్ ల‌గ్నంలో శ్రీరాముల వారిచే అమ్మవారి తలపై జిల‌క‌ర్ర‌, బెల్లం పెట్టించారు. అనంత‌రం మాంగ‌ళ్య‌ధార‌ణ కార్యక్రమం జ‌రిగింది. ఈ క‌మ‌నీయ వేడుకను క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా భ‌క్త‌జ‌నుల సంద‌డి లేకుండానే నిర్వ‌హించారు. రాములోరి క‌ళ్యాణానికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాల‌ను మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ దంప‌తులు స‌మ‌ర్పించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2021: రాజస్థాన్ జట్టుకు మూడు ఎదురుదెబ్బలు.. కోహ్లీసేనకు మరో విజయం లాంఛనమే.!

BECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త… బీఈసీఐఎల్‌లో 463 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నేడు చివరి తేదీ

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??