AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaurikund: పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతం గౌరీకుండం.. ఇక్కడ స్నానం చేస్తే వ్యాధులు నయం అవుతాయని నమ్మకం.. ఎక్కడంటే..

కేదార్‌నాథ్ ధామ్‌ యాత్ర హిందువులకు కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు.. దైవిక, స్వీయ-శుద్ధి ప్రక్రియ. ఈ ప్రయాణంలో గౌరీకుండం ఒక ప్రత్యేక గమ్య స్థానం. ఇక్కడ స్నానం చేయడం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ స్నానం చేయడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే కేదార్‌నాథ్‌ను సందర్శించే ముందు గౌరీ కుండంలో స్నానం చేసే సంప్రదాయం ఎందుకో తెలుసా..!

Gaurikund: పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతం గౌరీకుండం.. ఇక్కడ స్నానం చేస్తే వ్యాధులు నయం అవుతాయని నమ్మకం.. ఎక్కడంటే..
Gaurikund
Surya Kala
|

Updated on: Jun 17, 2025 | 7:39 AM

Share

హిమాలయాల ఒడిలో ఉన్న.. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కేదార్‌నాథ్ ధామ్.. కోట్లాది హిందువులకు విశ్వాస కేంద్రంగా ఉంది. దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ పవిత్ర స్థలం శివుని భక్తులకు మోక్షం, శాంతికి చిహ్నం. కేదార్‌నాథ్ ధామ్‌కు ప్రయాణం దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ యాత్ర సమయంలో గౌరీకుండంలో స్నానం చేయడం ముఖ్యమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ స్నానం చేయడం కేదారనాథుని దర్శనానికి ముందు ముఖ్యమైన ఆచారంగా పరిగణించబడుతుంది. కేదార్‌నాథ్ దర్శనానికి ముందు గౌరీకుండంలో స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం.

గౌరీకుండం ఒక పవిత్ర సంగమం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

కేదార్‌నాథ్ ధామ్‌కు 16 కి.మీ ముందు ఉన్న ఒక ముఖ్యమైన గమ్య స్థానం గౌరీకుండం. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు పురాణ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. గౌరీకుండానికి.. గౌరి అని కూడా పిలువబడే పార్వతి దేవి పేరు పెట్టారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే పార్వతి దేవి శివుడిని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది. శివుడి కోపం కారణంగా ఈ ప్రదేశంలో గణేశుడి తలని ఖండించారని.. అనంతరం అతనికి ఏనుగు తలను పెట్టి పునర్జన్మనిచ్చారని నమ్ముతారు.

ఈ కారణంగా గౌరీకుండానికి పార్వతి దేవి, గణేశుడితో ముడిపడి ఉన్న పవిత్ర స్థలంగా మారింది. గౌరీకుండంలో రెండు నీటి కొలనులు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో వేడి నీరు, మరొకటి చల్లటి నీరు ఉంటాయి. ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని.. ఈ నీటిలో స్నానం చేయడం వలన అనేక వ్యాధులను నయం అవుతాయని స్థానికులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

గౌరీకుండంలో స్నానం ప్రాముఖ్యత

హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌరీకుండంలో స్నానం చేయడం వల్ల భక్తులు తమ పాపాలన్నింటినీ వదిలించుకుంటారు. నిర్మలమైన హృదయంతో ఈ గౌరీకుండంలో స్నానం చేసే ఏ భక్తుడైనా గత జన్మల పాపాలను కూడా వదిలించుకుని కొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించగలడని నమ్ముతారు. గౌరీకుండంలో స్నానం చేయడం శారీరక , మానసిక శుద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం పార్వతి దేవి తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ గౌరీకుండంలో స్నానం చేసిన వ్యక్తిపై పార్వతి దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం.

పార్వతీ దేవి సంతోషించి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని , వారికి ఆనందం, శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు. ఆమె ఆశీర్వాదాలతో కేదార్‌నాథ్ ప్రయాణం విజయవంతమై.. ఫలవంతమవుతుందని నమ్మకం. గౌరీకుండంలో స్నానం చేయడం కేదార్‌నాథ్ యాత్రలో ఆచరించే పురాతన సంప్రదాయం. తరతరాలుగా భక్తులు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసానికి చిహ్నంగా మారింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us