AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. కార్తీకమాసంలో ప్రత్యేక రోజుల్లో స్పర్శ దర్శనాల రద్దు.. పూర్తి వివరాలు మీకోసం

కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాలలో భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలానే రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన రద్దు చేసినట్లు వెల్లడించారు.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. కార్తీకమాసంలో ప్రత్యేక రోజుల్లో స్పర్శ దర్శనాల రద్దు.. పూర్తి వివరాలు మీకోసం
Mallanna Temple
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Oct 31, 2023 | 3:35 PM

Share

హిందువులకు కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం.. శివకేశవులను ఆరాధించే ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా శివాలయాలకు, శైవ క్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలంలో నవంబరు 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తికమాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్తీక మాస ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం పరిపాలన భవనంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ  సమావేశంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ కార్తీక మాసంలో మల్లన్న ఆలయానికి వచ్చే  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

కార్తీక మాసంలో శని, ఆది, సోమవారాలలో భక్తులందరికి శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. అలానే రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన రద్దు చేసినట్లు వెల్లడించారు. కార్తీకమాసంలో సాధారణలో రోజుల్లో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో శివవిధిలో ఏర్పాటు చేయనున్నారు.  అలానే నవంబర్ 27వ తేదీ కార్తీక పౌర్ణమి.. అయితే 26 నే పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?