AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: కోట్ల ఖర్చుతో కట్టిన కట్టడాలు కూల్చివేస్తున్న దుర్గగుడి అధికారులు.. మండిపడుతున్న దుర్గమ్మ భక్తులు

దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ ఆలయం రెడీ అవుతుంది. అయితే కోట్లు ఖర్చు పెట్టి కట్టడం..కూల్చడం. దుర్గ గుడి అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. ఓవైపు దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కొండచరియలు కూలి పడుతున్నాయి. వీటి సంగతి చూడకుండా..ఈ అనవసరపు పనులు, ఖర్చులు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Indrakeeladri: కోట్ల ఖర్చుతో కట్టిన కట్టడాలు కూల్చివేస్తున్న దుర్గగుడి అధికారులు.. మండిపడుతున్న దుర్గమ్మ భక్తులు
Kanaka Durga Temple
Surya Kala
|

Updated on: Sep 26, 2023 | 8:04 AM

Share

అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులపాలిటి కొంగు బంగారంగా పూజలను అందుకుంటుంది. కృష్ణాతీరంలో వేసిన దుర్గాదేవిని తెలుగు రాష్ట్రాలతో పాటు అమ్మవారి భక్తులు దర్శించుకుంటారు. దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ ఆలయం రెడీ అవుతుంది. అయితే కోట్లు ఖర్చు పెట్టి కట్టడం..కూల్చడం. దుర్గ గుడి అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. ఓవైపు దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కొండచరియలు కూలి పడుతున్నాయి. వీటి సంగతి చూడకుండా..ఈ అనవసరపు పనులు, ఖర్చులు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సొమ్ము కూడా రాళ్ల పాలవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన రాతి కట్టడాలను కూల్చివేయడంలో దుర్గ గుడి అధికారులు బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా 2016లో దుర్గ గుడి ఇంజినీరింగ్‌ విభాగం ఈ రాతి కట్టడాలను పెద్దఎత్తున కట్టించింది. ఇప్పుడు వాటిని కూల్చివేయిస్తున్నారు అధికారులు. దుర్గ గుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగానే పెర్గోలను కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ విలువైన రాళ్లతో ఈ పెర్గోలను కట్టించారు అధికారులు. కట్టినప్పటి నుంచి ఈ పెర్గోలు నిరుపయోగంగానే పడి ఉన్నాయని చెబుతున్నారు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదని, తాజాగా కూల్చివేత కార్యక్రమం ప్రారంభించారు అధికారులు.

మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే ఇదంతా అంటున్నారు వాళ్లు. వీటిని కూల్చడానికి మరో కోటి రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని ఎందుకు కట్టారో, ఇప్పుడు మళ్లీ దుర్గమ్మ నిధులు భారీగా వెచ్చించి మరీ వీటిని ఎందుకు కూలుస్తున్నారో అంటూ భక్తులు మండిపడుతున్నారు. దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో ఏర్పాట్లపై కాకుండా కూల్చివేతలపై అధికారులు దృష్టి పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇంద్రకీలాద్రి దిగువన హైదరాబాద్‌ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగా కొండచరియలు విరిగిపడడంతో భక్తులతో పాటు ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ సంఘటన జరిగి 20 రోజులైనా భద్రతా పనులు ఇంకా పూర్తి కాలేదు. కొండ చరియలు విరిగిపడకుండా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, అమ్మవారి కొండ మీద అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గ గుడి అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు
అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు
కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు
కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు
సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 హెడ్‌ఫోన్స్.. పూర్తి వివరాలివే
సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 హెడ్‌ఫోన్స్.. పూర్తి వివరాలివే