AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Temple: టీటీడీకి ప్రవాస భక్తుడు భారీ విరాళం.. ఛైర్మన్‌కు డిడి అందజేత

Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swami)  కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati). ఇక్కడ కొలువైన స్వామివారిని..

Tirumala Temple: టీటీడీకి ప్రవాస భక్తుడు భారీ విరాళం.. ఛైర్మన్‌కు డిడి అందజేత
Devotee Donation
Surya Kala
|

Updated on: Mar 25, 2022 | 12:46 PM

Share

Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swami)  కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati). ఇక్కడ కొలువైన స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి సామాన్యుల నుంచి, సెలబ్రెటీల నుంచి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. తాజాగా దుబాయ్‌లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీ కి రూ కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడి అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.

గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ శుక్రవారం రూ.10, 01, 116 ( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమల లోని టీటీడీ చైర్మన్ క్యాపు కార్యాలయంలో ఈ మేరకు డిడిని టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు. ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.

Also Read: Yadadri Temple: నరసింహడు ఐదు రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం.. స్వామివారు పాంచ నరసింహడిగా ప్రసిద్ధి..

RRR Movie: మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన.. విప్లవవీరుడు అల్లూరి గెటప్‌లో బైక్ ర్యాలీ.. ఎక్కడంటే