ప్రపంచంలో తొలి దీపం వెలిగింది పాకిస్తాన్ లోని ఆ ప్రదేశంలోనేనా! బాణసంచా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?

దీపాల పండుగ హిందూ గ్రంధమైన స్కాంద పురాణం, అగ్నిపురాణంలో ప్రస్తావించబడింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం నుంచి దీపావళి జరుపుకుంటున్నారని నమ్ముతారు. అనంతరం దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీపావళిని జరుపుకునే సంప్రదాయం 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో శ్రీ కృష్ణుడు దీపాలను వెలిగించడం సూర్యుని పూజించడంలో ఒక భాగమని వర్ణించాడు.

ప్రపంచంలో తొలి దీపం వెలిగింది పాకిస్తాన్ లోని ఆ ప్రదేశంలోనేనా!  బాణసంచా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
Diwali 2023
Follow us

|

Updated on: Nov 12, 2023 | 12:36 PM

హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి. దేశ విదేశాల్లో ఉన్న హిందువులు దీపావళి పర్వదినాన్ని  ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు (నవంబర్ 12) దీపావళిని పిల్లలు, పెద్దలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే నవంబర్ 11న అయోధ్యలో ఛోటీ దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీపావళి రోజున సాయంత్రం ఇంట్లో, వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవి, గణపతిలకు పూజ చేస్తారు. అంతేకాదు ఇల్లు, ఆలయాలు, ఆఫీసు వంటి ప్రాంతాలను రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఇంటి ముందు ప్రమిదలను పెట్టి దీపాలను వెలిగిస్తారు. బాణసంచా కాల్చుతూ ప్రజలు ఘనంగా పండుగను జరుపుకుంటారు.

అయితే వాస్తవానికి దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది.. మొదటి సారిగా  ఎప్పుడు ఎక్కడ దీపాలు వెలిగించారు, బాణసంచా కాల్చడం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా.. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ రోజు తెలుసుకుందాం..   .

దీపావళిని ఎప్పటి నుండి జరుపుకోవడం మొదలు పెట్టారంటే..

దీపాల పండుగ హిందూ గ్రంధమైన స్కాంద పురాణం, అగ్నిపురాణంలో ప్రస్తావించబడింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం నుంచి దీపావళి జరుపుకుంటున్నారని నమ్ముతారు. అనంతరం దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీపావళిని జరుపుకునే సంప్రదాయం 5000 సంవత్సరాల నాటిదని నమ్మకం. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో శ్రీ కృష్ణుడు దీపాలను వెలిగించడం సూర్యుని పూజించడంలో ఒక భాగమని వర్ణించాడు. దీపావళి గురించి అంతర్దృష్టిని అందించే స్కంద పురాణంలో కొన్ని శ్లోకాల్లో ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

మొదటి దీపదాన పండుగ ఎక్కడ జరిగిందంటే..?

స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది “మద్రాజ్యే యే దీపానాం భువి కుర్వంతి మానవః.. ఈ శ్లోకాన్ని సరిగ్గా చదివితే.. ఇంతకు ముందు మద్రా రాష్ట్ర ప్రజలు దీపాలను వెలించారని.. దీప దానం చేశారని అర్ధం. మద్రా రాష్ట్రం అంటే ఇప్పుడు తక్షశిల.. పాకిస్తాన్‌లోని కాశ్మీర్ మధ్య ఉన్న ప్రదేశం. రాక్షస రాజు బలి దీపాలను దానం చేయడం మొదలు పెట్టాడట. బలి తన పాలనలో దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని ప్రారంభించాడని నమ్ముతారు.

మొదటి దీపం ఎక్కడ పెట్టారంటే

దాదాపు 5 వేల సంవత్సరాల క్రితం అంటే సింధు నాగరికతకు నాల్గవ సహస్రాబ్దికి ముందు మట్టి దీపాలను ఉపయోగించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. సింధు లోయలోని త్రవ్వకాల్లో మెహర్‌ఘర్‌లోని పురావస్తు శాఖ బృందం పురాతన మట్టి దీపాలను కనుగొన్నారు. తరువాత కార్బన్ డేటింగ్ చేసినప్పుడు, ఈ దీపాలు సుమారు 5 వేల సంవత్సరాల నాటివని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇదే విధంగా ఇటువంటి  సంఘటన భారతదేశంలోని సంగల్‌లో కూడా జరిగింది. 2500 సంవత్సరాల క్రితం మౌర్యుల కాలం నాటి దీపాలు సంగల్ లో దొరికాయి.

బాణాసంచా కాల్చడం ఎప్పుడు మొదలు పెట్టారంటే

కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో బాణాసంచా ఉపయోగించినట్లు.. రాకెట్‌ను కాల్చినట్లు తెలుస్తుంది. 2396 సంవత్సరాల క్రితం రచించిన తన అర్థశాస్త్రంలోని 14వ అధ్యాయంలో కౌటిల్యుడు ‘తేజాంచూర్ణం’ చేసే విధానాన్ని వివరించాడు. తేజాన్‌ పౌడర్‌కు నిప్పంటించగానే నిప్పురవ్వలు వచ్చాయని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ