AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కొత్త సంవత్సరానికి ఆధ్యాత్మిక శోభ.. నగరానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఇవే..

నూతన సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కొత్త ప్రారంభాలు, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది....

Hyderabad: కొత్త సంవత్సరానికి ఆధ్యాత్మిక శోభ.. నగరానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఇవే..
Keesaragutta
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 31, 2022 | 7:37 AM

నూతన సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కొత్త ప్రారంభాలు, కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటారు. ప్రత్యేక ప్రారంభాన్ని ఇవ్వడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తారు. అయితే.. కొంతమంది తమ కొత్త సంవత్సరాన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రారంభంతో ప్రారంభించేందుకు ఇష్టపడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించడం నుంచి దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల వరకు.. ఏదైనా ఒక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి.. కొత్త సంవత్సరం కోసం భారతదేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని నిర్ణయించుకుంటే, మీ జాబితాలో ఉండవలసిన దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఐదు దేవాలయాల వివరాలను మీకు అందిస్తున్నాం.

1. చిల్కూర్ బాలాజీ దేవాలయం/ వీసా బాలాజీ: వీసా బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న పురాతన హిందూ దేవాలయం. 1980వ దశకంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విద్యార్థుల బృందం ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత యుఎస్‌కి వీసాలు పొందినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ గుడికి ‘వీసా టెంపుల్’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో హుండీ లేకపోవడం విశేషం. ఈ ఆలయంలో కొలువైన వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే వీసా అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

2. రత్నాలయం: తెలంగాణలో నెలకొని ఉన్న రత్నాలయం వేంకటేశ్వరుడు, ఉభయ దేవేరులైన పద్మావతి, అలివేలు మంగమ్మల పవిత్ర నివాసం. ఇది హైదరాబాద్ నగరం సందడి నుంచి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది.

ఇవి కూడా చదవండి

3. కీసరగుట్ట: తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం కీసరగుట్ట. హైదరాబాదులో ఎక్కువగా సందర్శించే ప్రసిద్ధ దేవాలయాలలో ఇదీ ఒకటి. శివుని భక్తులు తప్పక సందర్శించవలసి ఉంటుంది. ఇది భారతదేశంలోని చాలా పురాతన, చరిత్రాత్మక దేవాలయం. వాస్తుశిల్పం, కుడ్యచిత్రాలు, పెయింటింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.

4. పెద్దమ్మ టెంపుల్: ఇది హైదరాబాదు కొండలలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సింహంపై కూర్చున్న దుర్గాదేవిగా ఉన్న పెద్దమ్మ దేవిగా అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటోంది. దుర్గాదేవితో సహా 11 రూపాల గ్రామ దేవతలను ఆరాధించడానికి ఈ ఆలయాన్ని సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..